యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా స్టార్ మాలో వచ్చిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఎన్.టి.ఆర్ హోస్టింగ్ టాలెంట్ చూసి బుల్లితెర ఆడియెన్స్ అంతా కూడా ఆయనకు ఫ్యాన్స్ గా మారారని చెప్పొచ్చు. ఇక బిగ్ బాస్ సెకండ్ సీజన్ షురూ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ స్థానంలో నాచురల్ స్టార్ నాని ఈసారి హోస్ట్ గా చేస్తున్నాడు. 


ఈమధ్యనే ఈ సీజన్ కు సంబందించిన ప్రోమో కూడా వదిలారు. టీ తాగుతూ బాబాయ్ ఈసారి ఇంకొంచం మసాలా అంటాడు నాని. అంటే టీలోనే కాదు బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో మసాలా ఉండనుందని చెబుతున్నారు. ఇక ఈ సీజన్ లో కంటెస్టంట్స్ కూడా నిత్యం వార్తల్లో ఉన్న వారికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారట. రీసెంట్ గా హీరోయిన్ గా క్లిల్ అవకపోయినా సరే అందరికి తెలిసిన పూనం హడావిడి తెలిసిందే.


కత్తి మహేష్ ఆమెను టార్గెట్ చేయడం ఆమెకు సంబందించిన ఆధారాలు బయటపెడతా అనడం అప్పట్లో సంచలనంగా మారాయి. అయితే అప్పుడు ఎలాగోలా ఆ ప్రాబ్లెం సాల్వ్ అవగా ఈమధ్య పూనం తన ట్విట్టర్ లో డైరక్టర్ పై విరుచుకుపడుతుంది. అది కచ్చితంగా త్రివిక్రం గురించే అని తెలుస్తుంది. మరి అంత డైరెక్ట్ గా పూనం ఎందుకు టార్గెట్ చేస్తుంది అన్నది మాత్రం తెలియలేదు.


ఇక బిగ్ బాస్ సీజన్-2 లో పూనం కౌర్ కూడా ఉంటుందని టాక్. కంటెస్టంట్ గా పూనం తన సత్తా చాటనుందట. పూనం మాత్రమే కాదు ఈసారి మసాలా పెంచేందుకు నిత్యం వార్తల్లో ఉన్న వారిని కంటెస్టంట్స్ గా తీసుకుంటున్నారట. ఒకప్పడు స్టార్ గా ఉన్న్న ఓ క్రేజీ హీరోయిన్ కూడా ఈసారి బిగ్ బాస్ లో కనిపిస్తుందని అంటున్నారు. మరి అసలు కంటెస్టంట్స్ లిస్ట్ ఏంటో త్వరలో తెలుస్తుం



మరింత సమాచారం తెలుసుకోండి: