మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన సినిమా నేల టిక్కెట్టు. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఏమాత్రం మంచి టాక్ సొంతం చేసుకోలేదు. థియేటర్ నుండి బయటకు వస్తూనే ప్రేక్షకులు నీరసమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తున్నారు. ఇక పబ్లిక్ టాక్ అయితే ఈమధ్య కాలంలో ఏ సినిమాకు చెప్పనట్టుగా చెబుతున్నారు. రెండు హిట్ సినిమాలను తీసిన డైరక్టర్ ఇలాంటి సినిమా ఎలా చేశాడని ఆశ్చర్యపోతున్నారు. 


సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ కృష్ణ ఆ సినిమా హిట్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. నాగార్జున కెరియర్ లో 50 కోట్ల మార్క్ అందుకున్న సినిమా సోగ్గాడే చిన్ని నాయనా. అయితే ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా కూడా కళ్యాణ్ కృష్ణకు హిట్ గా నిలిచింది. కాని నేల టిక్కెట్టు మాత్రం తీవ్రంగా నిరాశ పరచింది.


కథ, కథనాలు ఏమాత్రం కొత్తగా లేవని సినిమా చూసిన ఆడియెన్స్ చెబుతున్నారు. అయితే సోగ్గాడు హిట్ తో ఆ సినిమాలోని బంగార్రాజు పాత్రతో అదే టైటిల్ గా కళ్యాణ్ కృష్ణ సినిమా చేయాలని చూశాడు. ఆ సినిమాను ఆపేసి కళ్యాణ్ కృష్ణ రవితేజతో నేల టిక్కెట్టు చేశాడు. అయితే ఇప్పుడు నేల టిక్కెట్టు తర్వాత నాగార్జున అతనికి అవకాశం ఇస్తాడా లేడా అన్నది డౌట్ గా మారింది.


ప్రస్తుతం నాగార్జున నానితో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సినిమా ఏంటి అన్నది కన్ ఫాం చేయలేదు. వర్మతో ఆఫీసర్ ఎలాగు రిలీజ్ అవుతుండగా నానితో చేసే సినిమా వెరైటీ కాన్సెప్ట్ తో రాబోతుందట. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో ఆ సినిమా తెరకెక్కుతుంది. అశ్వనిదత్ నిర్మిస్తున్న ఆ సినిమా టైటిల్ ఇంకా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: