తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ‘శివ’ చిత్రం అప్పట్లో ఎన్నో రికార్డులుకు క్రియేట్ చేసింది.  అప్పటి వరకు మూస పద్దతిలో సాగుతున్న విలనీజానికి కొత్త భాష్యం చెప్పింది. అప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీలో మాఫియా, గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి.  ఆ తర్వాత నాగార్జున, రాంగోపాల్ కాంబినేషన్ లో అంతం, గోవింద గోవింద చిత్రాలు వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.  చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఆఫసర్’ చిత్రం జూన్ 1 న రిలీజ్ కాబోతుంది.

కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో నిర్వహించారు.  ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘ఆఫీసర్’ చిత్రం గురించి, రాంగోపాల్ వర్మ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘నాగార్జున గురించి మాట్లాడితే నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి’ అని వర్మ చెప్పిన మాటకు కింగ్ బదులిస్తూ.. ‘రాము నీ కళ్లలో నీళ్లు కూడా తిరుగుతాయా?’ అని నవ్వుతూనే ‘కనపడ్డాయి నాకు’ అన్నారు.
Image result for OFFICER PRE RELEASE MOVIE
ఈ మద్య ఎక్కువగా వింటున్నాను. ఇంత వయసొచ్చినా ఇంకా యంగ్‌గా కనిపిస్తున్నానని అంతా అంటున్నారు. ఆ ఏజ్ గురించి మానేయండయ్యా బాబు. ఐ యామ్ స్టిల్ యంగ్. ఇందాకే చైతన్య అన్నాడు కదా బ్రదర్ అని. గుర్తుపెట్టుకోండి. ఏజ్ గురించి అనడం మానేయండి’ అంటూ ఆడియన్స్ ని ఉత్తేజ పరిచారు కింగ్ నాగార్జున. ఈ మద్య చిత్ర పరిశ్రమలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది..డీటీఎస్‌లు వచ్చాయి, డాల్బీ అట్మాస్‌లు వచ్చాయి కానీ ఒక సౌండ్ సినిమాను ముందుకు తీసుకెళ్లడం ‘శివ’ తరవాత ఇంకేది రాలేదు.
Image result for OFFICER PRE RELEASE MOVIE
ఇదేదో నా సినిమా అని చెప్పుకోవడంలేదు. అది రాము సినిమా. అది అతని గొప్పతనం’ అని వర్మను కింగ్ పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు మళ్లీ అలాంటి సౌండ్ ఎఫెక్ట్‌తో ‘ఆఫీసర్’ సినిమా వస్తోందని తాను నమ్ముతున్నట్లు నాగార్జున చెప్పారు. ఈ కార్యక్రమంలో అక్కినేని హీరోలతో పాటు అమల, రాంగోపాల్ వర్మ, ఎం.ఎం.కీరవాణి, వై.వి.ఎస్.చౌదరి తదితరులు పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: