తెలుగు ఇండస్ట్రీలో తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ గత కొంత కాలంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిం తండ్రి, మామ పాత్రలు వేస్తూ వస్తున్నారు.  తాజాగా మైసూరు దత్త పీఠంలో సద్గురు గణపతి సచ్చిదానంద స్వామి పుట్టినరోజు సందర్భంగా నటుడు రాజేంద్రప్రసాద్‌కు కళానిధి అవార్డుని ప్రదానం చేశారు.   నాలుగు ద‌శాబ్దాలకు పైగా హీరోగా, కామెడీ స్టార్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నందుకు గాను ఆయన్ను ఈ పురస్కారంతో గౌరవించారు.
Image result for రాజేంద్ర ప్రసాద్ కళానిధి
ఈ సంద‌ర్భంగా గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామి మాట్లాడుతూ - నాకు హాస్యం అంటే చాలా ఇష్టం. హాస్యానికి కిరిటాన్ని పెట్టిన న‌ట‌కిరీటికి ఈ క‌ళానిధి అవార్డు ఇవ్వ‌డం ఆనందంగా ఉంది అన్నారు.   డా.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. నటుడిగా కెరీర్ ప్రారంభించిన కొత్తలో చిన్న పాత్రలైనా ఇష్టంతో చేశానని..కామెడీ హీరోగా మారిన తర్వాత నాకు ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయని అన్నారు.
Image result for రాజేంద్ర ప్రసాద్ కళానిధి
ఇప్పటి వరకు  నటుడిగా ఎన్నో అవార్డులను అందుకున్నప్పటికీ సద్గురు గణపతి సచ్చిదానందస్వామివారి చేతుల మీదుగా కళానిధి అవార్డును స్వీకరించడం ఆనందంగా ఉంది’’ అన్నారు.న‌టుడిగా ఎన్నో అవార్డుల‌ను అందుకున్న‌ప్ప‌టికీ స‌ద్గురు గ‌ణ‌ప‌తి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా క‌ళానిధి అవార్డును స్వీక‌రించ‌డం ఆనందంగా ఉంది అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: