తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు బయోపిక్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపుతుంది.  అయితే మహానటి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు వస్తున్నాయని వార్తలు వచ్చాయి.  నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని ‘ఎన్టీఆర్’ బయోపిక్ తీయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ముహూర్తం షూట్ కూడా అయ్యింది..కాకపోతే అనుకోకుండా ఈ చిత్ర దర్శకుడు తేజ తప్పుకుంటున్నట్లు తెలపడంతో కథ మొదటికి వచ్చింది.
Image result for ntr biopic
కానీ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నందమూరి అభిమానులకు మరో శుభవార్త తెలిపారు బాలయ్య.  ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించబోతున్నారని ఓ వీడియో రిలీజ్ చేశారు.  మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ చిత్రానికి కూడా రూపకల్పన చేశారు.  కాగా, ఎన్టీఆర్ బయోపిక్‌ విషయంలో కూడా అదే వడి చూపుతాడనే అంచనాలున్నాయి.
Image result for ntr biopic
ఎలాగైనా ఎన్టీఆర్ బయోపిక్‌ను వచ్చే సంక్రాంతి సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది బాలయ్య ఆకాంక్ష. ఆ మేరకు క్రిష్ కూడా సినిమాను పూర్తి చేయనున్నాడని సిద్దమవుతున్నారట. మహీ వీ రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టీ నటిస్తున్నాడు. ఇక ఇతర ప్రధాన తారాగణం ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాను ప్రధానంగా వైఎస్ పాదయాత్ర ‘ప్రజాప్రస్థానం’ ఆధారంగా రూపొందిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ‘యాత్ర’ అని టైటిల్ కూడా పెట్టారు.
Image result for ysr biopic poster
సినిమాకు స్క్రిప్ట్‌ కూడా రెడీ అయిపోయినట్టుగా తెలుస్తోంది. తారాగణం పూర్తిగా కుదిరితే ఈ సినిమా శరవేగంగానే పూర్తై సంక్రాంతి సందర్భంగా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఇక క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ కూడా త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్దం అవుతుంది.  మొత్తానికి ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ వర్సెస్ వైఎస్సార్ చిత్రాలు ఏ విధంగా ప్రేక్షకులను మెప్పించబోతున్నాయో వేచి చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: