యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా ఎదిగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ ఉన్నా అతడు కోరుకున్న హిట్ ఇంకా ఈయంగ్ హీరోకి రాలేదు. అతడు నటించిన ‘అల్లుడు శీను’ ‘స్పీడున్నోడు’ ‘జయ జానకి నాయక’ వంటి చిత్రాలు భారీ బడ్జెట్ తో నిర్మించినా హీరోగా శ్రీనుకు గుర్తింపు వచ్చింది కాని అతడి సినిమాలు కమర్షియల్ గా ఏమాత్రం సక్సస్ కాలేదు.
ఇలాంటి పరిస్థితులలో శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సాక్ష్యం’ మూవీ గురించి వస్తున్న వార్తలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీ జూన్ లోనే విడుదల చేద్దాము అని అనుకున్నా ఈమూవీకి చేస్తున్న భారీ గ్రాఫిక్స్ వర్క వల్ల ఈమూవీ విడుదల జులైకు వాయిదా వేశారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపధ్యంలో ఈ మూవీ పై మరింత అంచనాలు పెరిగాయి.
ఒక సోషియో ఫాంటసీ కథతో భారీ స్థాయిలో నిర్మింపడుతున్న ఈమూవీ సీజీ వర్క్ ‘బాహుబలి’ చిత్రానికి పనిచేసిన టీమ్ పూర్తి చేస్తూ ఉండటం సంచనలంగా మారింది. పంచభూతాల కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో అంతర్లీనంగా కర్మ సిద్దాంతం ప్రస్తావన ఉంటుందని తెలుస్తోంది. ఈమూవీలో పంచభూతాల ప్రస్తావన ఉండటంతో దానికి అనుగుణంగా ఈమూవీలో ఐదు పాటలు ఉంటాయని తెలుస్తోంది.
ఆశ్చర్యకరంగా ఈ ఐదు పాటలను అయిదుగురు ఫేమస్ సింగర్లు పాడడం విశేషం. ఎస్పీబాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్, కైలాస్ ఖేర్, హరిహరన్, బాంబే జయశ్రీ ఆలపించిన ఈమూవీలోని పాటలు గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశాలపై బ్యాక్ గ్రౌండ్ నేపధ్యంలోని పాటలుగా సినిమా సన్నివేశాలతో ముడిపడి ఉంటాయని తెలుస్తోంది. బెల్లంకొండ పక్కన పూజ హెగ్డే నటిస్తున్న నేపధ్యంలో ఈమూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఈమూవీ నిర్మాతలతో పాటు బెల్లంకొండ శ్రీను భారీ అంచనాలు పెట్టుకున్నాడు..