అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తాజాగా చేసిన ఫోటోషూట్ కుర్రాళ్ళ గుండెల్లో మంట పెట్టేలా ఉంది. అసలే లేలేత అందాలు ఆపై అందమైన భామ 'స్కిన్ షో' చేయడంతో కుర్రాళ్ళ గుండె లయ తప్పడం ఖాయం. జాన్వీ కపూర్ అంతలా రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీని ముస్తాబు చేయటం కోసం చేసిన ఫోటోషూట్ లో రక రకాల భంగిమల్లో అందాలు ఆరబోస్తూ ఫోజులిచ్చింది జాన్వీ.
క్లీవేజ్ అందాలతో పాటుగా థైస్ అందాలు బోనస్
గా కనువిందు చేసింది. దీంతో యువత మతులు మతిపోయేలా
ఇచ్చిన ఫోజు లిచ్చేస్తుంది. ఇరవైయేళ్ళ వయసులో నాడు శ్రీదేవి రూపానికి నేటి జాన్వీ కపూర్ అతి దగ్గరగా ఉంది అనే కంటే బింబం ప్రతిబింబం లాగా ఉంది అంటేనే సమంజసం అనవచ్చు.
జాన్వీ కపూర్ తన డెబ్యూ మూవీ "దఢక్" లో నటిస్తోంది. మరాఠీలో ప్రభంజనం సృష్టించిన "సైరత్" చిత్రానికి రీమేక్ గా రూపొందుతుంది ఈ దఢక్. శ్రీదేవి బ్రతికి ఉన్నప్పుడే ఈ సినిమా ప్రారంభమైంది ఇక ఈ సినిమాని జులైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు, పార్టీలు, పబ్ లంటూ తిరిగిన జాన్వీకి ఇక హీరోయిన్ హోదా వచ్చేసింది.
దఢక్ ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యేది గారాంటీ అంటున్నారు. అదే జరిగితే ఈ భామ టాప్-రేంజ్ కు వెళ్లడం ఖాయం. నటనలో, గ్లామర్ లో తన తల్లిని మరిపిస్తే మాత్రం 'మరో శ్రీదేవి' బాలీవుడ్ కు దక్కినట్లే. అది తెలియాలంటే జులై వరకు ఎదురు చూడాల్సిందే.