తెలుగు ఇండస్ట్రీ లో బయోపిక్ లా జోరు మొదలైంది. ఒక పక్క ఎన్టీఆర్ జీవిత చరిత్ర సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మరో పక్క యాత్ర అనే పేరు తో వైస్సార్ జీవిత చరిత్ర షూటింగ్ జరుగుతుంది. అయితే ఇప్పడు ఏఎన్నార్ బయోపిక్ కూడా ఉంటుందని ప్రచారాలు జోరు అందుకున్నాయి. అయితే దీని మీద నాగార్జున స్పందించాడు. నాన్న గారి జీవితం లో ఎటువంటి ఒడి దుడుకులు లేవు సాఫీగా జరిగిపోయింది. అందుకే బయో పిక్ అంతగా బాగా ఉండదు అను చెప్పాడు.
చివరి రోజుల్లో కూడా ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి బయోపిక్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అలాగే ఆయన కథ సినిమా కన్నా ఒక పుస్తకంలా రచిస్తే బాగుంటుందని తెలిపారు. నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయంలో ఏఎన్నార్ అభిమానులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వెళ్లి పెద్ద స్టార్ అయ్యారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. పుట్టిన ఊరుకు ఎంతో చేశారు.
అలాంటి లెజెండరీ జీవితాన్ని ఓ సారి తెరపై చూపిస్తే బాగుంటుందని ఏఎన్నార్ సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. బయోపిక్ చేయాలంటే చేదు సంఘటలనే అవసరం లేదు. గొప్ప వ్యక్తులు జీవితాలు ఎప్పుడూ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంటాయి. వాటిని తెలుసుకోవాలని ఆడియన్స్ కోరుకుంటారు. కానీ నాగ్ ఇలా ఏఎన్నార్ జీవితంలో ఏదీ లేదనడం శోచనీయం అన్నారు.