పూజా హెగ్డే నిజం చెప్పాలంటే ఈ అమ్మడికి ఒక్కటంటే ఒకటి కూడా తెలుగు లో హిట్స్ లేవని చెప్పాలి. మొదట్లో వరుణ్ తేజ్ మరియు చైతన్య సరసన నటించింది ఆ రెండు సినిమాలు అంతగా జనాలు ను ఆకట్టుకోలేదు. తరువాత హిందీ లో హృతిక్ రోషన్ సరసన నటించింది. ఆ సినిమా కూడా డిజాస్టర్ కావడం తో తెలుగు లో అల్లు అర్జున్ సరసన నటించింది. అది కూడా ఫ్లాప్ సినిమా అని తెలిసిన సంగతే..!
అయితే అయిన తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయి. దానికి కారణం ఈ భామ స్కిన్ షో కు తాన సిద్ధమని చెప్పకనే చెబుతుంది. దీనితో దర్శక నిర్మాతలు హీరోయిన్ వెంట పడుతున్నారు. తెలుగు లో డీజే సినిమా లో బికినీ వేసి కుర్ర కారు గుండెల్లో చిచ్చు రేపింది. ఈ సినిమా లో ఈ సినిమాలో ఆమె బికినీ వేసి పరిమితికి మించి స్కిన్ షో చేయడంతో యువతను ఆకట్టుకున్నప్పటికీ, అది సినిమా ఫలితంపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఇక అవకాశాలు లేక విసిగిపోయిన ఈమె రామ్చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో ఐటెంసాంగ్లో సైతం జిగేలు రాణిగా చిందులు వేసింది. ఈ సినిమా కాస్త ఓ రేంజ్లో ఆడటంతో మరోసారి ఆమె కెరీర్ ఊపందుకుంది. ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్-ఎన్టీయార్ 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో, అలాగే మహేష్-వంశీ పైడిపల్లి సినిమాలలో హీరోయిన్గా నటించే అవకాశం కొట్టేసింది. అంతేకాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సాక్ష్యం అనే చిత్రంలో కూడా నటిస్తోంది. అందాల ఆరబోతకు తాను ఎప్పుడైనా సిద్ధమేనంటూ దర్శక నిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. ఈ భామ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నైజంతో ముందుకెళ్తోంది.