ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో వారసత్వపు హీరోల హవా బాగా పెరిగిపోయింది.  స్టార్ హీరోలు, దర్శక, నిర్మాతల తనయుడు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు.  అందులో సక్సెస్ అయ్యే వారు కొద్దిమందే అవుతున్నారు.  తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ బెల్లం కొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడుశీను’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా విజయం సాధించలేదు. గత సంవత్సరం జయజానకీ నాయక కాస్త పరవాలేదు అనిపించింది. 

అయితే ఈ యంగ్ హీరో మాత్రం చాలా లక్కున్నోడని అందరూ అంటున్నారు. ఇప్పటి కుర్ర హీరోలు అనగానే టాప్ హీరోయిన్ కాస్త వెనుకా ముందు అడుతారు..కానీ మనోడి సరసన టాప్ హీరోయిన్లు నటిస్తున్నారు.  ఇప్పటికే సమంత, రకూల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే..తాజాగా మరో టాప్ హీరోయిన్ కూడా బెల్లంకొండ సరసన నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నూతన దర్శకుడు శ్రీనివాస్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ వంశధార క్రియేషన్స్‌ పతాకంపై నవీన్‌ సొంటినేని(నాని) ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


ఇందులో సాయి శ్రీనివాస్‌ సరసన కాజల్‌ హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా చిత్ర షూటింగ్‌లో కాజల్‌ పాల్గొంటున్నారు. ఆ విశేషాలను చిత్ర బృందం తెలియజేస్తూ, 'ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్‌లో వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో సాయి శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం.

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. చోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు హైలైట్‌ అవుతాయి. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితీష్‌ ముఖేష్‌, హర్షవర్ధన్‌ రాణే, సత్యం రాజేష్‌, కళ్యాణి నటరాజన్‌, అపూర్వ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చంద్రబోస్‌ అన్ని పాటలకు సాహిత్యాన్ని అందిస్తున్నారు. త్వరలో చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తాం అన్నారు చిత్ర యూనిట్.


మరింత సమాచారం తెలుసుకోండి: