మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్.   పిల్లా నువ్వులేని జీవితం సినిమా మంచి విజయం అందుకున్న సాయిధరమ్ తర్వాత వచ్చిన సినిమాలు కూడా మంచి విజయం అందుకున్నాయి.  సుప్రీమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘తేజ్ ఐలవ్ యూ’ సినిమాలో నటిస్తున్నాడు.  ఇండస్ట్రీలో తాను ఎంతో అభిమానించే వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అని ఎన్నో సార్లు చెప్పారు. ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్దంగా ఉన్నానని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. 

తాజాగా పవన్ కళ్యాన్ కోసం సాయిధరమ్ మరోసారి తన మనసులో మాట చెప్పారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తో బిజీ గా ఉన్న సంగతి తెల్సిందే.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యం లో సాయి ధరమ్ తేజ్ ను మావయ్య తరుపు ప్రచారం చేస్తారని అడుగగా..పవన్‌ కల్యాణ్‌ ఆదేశిస్తే జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమేనని తన ఉద్దేశాన్ని తెలియజేశారు.

రీసెంట్ గా రాంచరణ్ సైతం తన బాబాయి కోసం పార్టీ ప్రచారంలోకి రావాలంటే ఆనందంగా వస్తానని చెప్పారు. కాకపోతే ఈ విషయం పై పవన్ కళ్యాన్ మాత్రం స్పందించలేదు. గతంలో పార్టీ ప్రచారాలకు కుటుంబ సభ్యులను దింపడం పెద్దగా ఫలితం లేదని భావించిన పవన్ ఈసారి తన కుటుంబ సభ్యులను ఎవ్వరినీ పిలవడం లేదు. 

సాయి ధరమ్ తేజ్ ను మావయ్య తరుపు ప్రచారం చేస్తారని అడుగగా..పవన్‌ కల్యాణ్‌ ఆదేశిస్తే జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమేనని తన ఉద్దేశాన్ని తెలియజేశారు.తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హీరోయిన్‌ కేథరిన్‌తో కలిసి శుక్రవారం వచ్చారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ ఆదేశిస్తే జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమేనని తన ఉద్దేశాన్ని తెలియజేశారు. తాను నటించిన ‘తేజ్‌.. ఐ లవ్‌ యు’ సినిమా ఈ నెల 29న విడుదలవుతుందని, మరో సినిమా షూటింగ్‌ దశలో ఉందని సాయిధరమ్‌ తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: