సినిమా ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి అకాల మరణంతో కోట్ల మంది అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో మంచి పొజీషన్ లో ఉన్న శ్రీదేవి బాలీవుడ్ కి పయనం అయ్యింది. అక్కడే స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహం చేసుకుంది. వీరికి జాహ్నవి, ఖుషీ కపూర్ లు జన్మించారు. జాహ్నవి కపూర్ ని హీరోయిన్ గా చూడాలనే ఆకాంక్ష శ్రీదేవికి ఎంతగానో ఉండేది. కానీ అనుకోని మృత్యువు ఆమెను కబలించింది. ప్రస్తుతం జాహ్నవి ‘ధడక్’సినిమాలో నటిస్తుంది.
జూలై 20న విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందిస్తూనే మరోవైపు తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు విరివిగా అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్తో షాక్ ఇచ్చింది జాన్వి. బాలీవుడ్ లో రాణించాలంటే..గ్లామర్ ప్రాధాన్యత పాత్రల్లో నటించాల్సి ఉంటుంది. అయితే శ్రీదేవి కూతురు కావడంతో ఆడియన్స్ కి మరింత ఎక్స్ పెక్టేషన్ ఉంటాయి.
దాంతో జాన్వి అరంగేట్రం కోసం ఎంతగానో ఎదురుచేస్తున్న అభిమానులకు ఊహించని స్థాయి సెక్సీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి సెగలు పుట్టించింది. . మూడు వెరైటీ డ్రెస్లలో క్లోవేజ్ షోతో కాకపుట్టించింది. ఓ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అందాలను ఒలకబోస్తూ.. తన నెక్స్ట్ మూవీ సంగతుల్ని ఇష్టా, ఇష్టాలను చెబుతూ కలర్ఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చింది.
ధర్మా ప్రొడక్షన్స్ జీ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాహ్నవికి జోడీగా హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ నటిస్తున్నారు. ప్రేమ-పగల నేపథ్యంలో తెరకెక్కి మారాఠీలో అద్భుతం విజయం సాధించిన సైరాత్ ను హిందీలో ధడక్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 20 విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.