టాలీవుడ్ లో వరుస సక్సెస్ లను సాధిస్తున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు సినిమాతో నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టిన మైత్రి మొవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవిశంకర్, మోహన్ అనతి కాలంలోనే బడా నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్నారు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ తర్వాత రీసెంట్ బ్లాక్ బస్టర్ రంగస్థలం కూడా ఆ బ్యానర్ లో వచ్చిన సినిమానే. 


అంతేకాదు క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేయడంలో కూడా ఈ నిర్మాణ సంస్థకు మంచి పేరు ఉంది. ప్రస్తుతం సెట్స్ మీద నాగ చైతన్య, చందు మొండేటి సవ్యసాచి సినిమా ఉండగా శ్రీను వైట్ల, రవితేజ సినిమా కూడా ఈ నిర్మాణ సంస్థ నుండే వస్తుంది. ఇక ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్. కమర్షియల్ గా తీస్తే చాలా డబ్బులొచ్చేవి కాని ఈ దర్శకుడు తన క్రియేటివిటీని చూపిస్తూ ఏ దర్శకుడు చేయలేని కొత్త ప్రయోగాలు చేస్తాడు.


అతనే చంద్రశేఖర్ ఏలేటి. ఐతే సినిమా ద్వారానే అతని టాలెంట్ గుర్తించారు. అయితే ఆయన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవ్వవని ఓ వాదన ఉంది. మనమంతా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న చంద్రశేఖర్ ఏలేటి ఈసారి నితిన్ హీరోగా కమర్షియల్ సినిమా చేస్తున్నాడట. మైత్రి బ్యానర్లో ఈ సినిమా రాబోతుందని అంటున్నారు. నితిన్ హీరోగా ఏలేటి సినిమా అసలు ఊహలకు కూడా అందని ఈ క్రేజీ కాంబినేషన్ కచ్చితంగా మంచి సినిమానే వస్తుందని అంటున్నారు.


ఛల్ మోహన్ రంగ సినిమా తర్వాత నితిన్ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో శ్రీనివాస కళ్యాణం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత చంద్రశేఖర్ ఏలేటి సినిమా ఉంటుందని తెలుస్తుంది. కచ్చితంగా నితిన్ కెరియర్ కు ఈ సినిమా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఏలేటి అసలైతే ఈ సినిమాను మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తో చేయాలని అనుకున్నాడు ఏమైందో ఏమో కాని ఆ ప్రాజెక్ట్ తేజూ చేతిలో నుండి నితిన్ దగ్గరకు వచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: