బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి కాంబినేషన్ సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి అంచనాలు భారీగా పెరిగాయి. ఎవరి ఊహలకు అందినట్టుగా వారు రోజుకో న్యూస్ ఈ సినిమాపై రాసేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్ తో రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కథగా మొన్నటివరకు ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అని చెప్పగా లేటెస్ట్ గా ఇదో గ్యాంగ్ స్టర్ కథ అని అంటున్నారు.


లీక్ అయిన కథ ప్రకారం ఈ సినిమాలో రాం చరణ్ పోలీస్ గా కనిపిస్తాడట. ఎన్.టి.ఆర్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడట. ఈ ఇద్దరు అన్నదమ్ములను తెలుస్తుంది. అంతేకాదు ఎన్.టి.ఆర్ అన్నగా, రాం చరణ్ తమ్ముడిగా నటిస్తున్నాడని తెలుస్తుంది. కుటుంబంలో జరిగే గొడవల వల్ల పెద్దోడు గ్యాంగ్ స్టర్ గా.. చిన్నోడు పోలీస్ గా మారుతారట. ఇద్దరి మధ్య సీన్స్ అదిరిపోతాయని అంటున్నారు.


ఇక బయటకు వచ్చిన ఈ స్టోరీని చూసి హాలీవుడ్ సినిమా అమెరికన్ గ్యాంగ్ స్టర్ కు కాపీ అంటున్నారు. అసలు బయటకు వచ్చిన కథ నిజామా కాదా అన్నది కూడా తెలియదు అలాంటిది ఎవరో కథ చెప్పడం దాన్ని మరెవరో కాపీ అనడం కామెడీగా ఉంది. జక్కన్న చేస్తున్న ఈ మల్టీస్టారర్ తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాగా తెరకెక్కిస్తారట.


విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నుండి రెగ్యులర్ షూట్ మొదలవనుంది. సినిమాలో హీరోయిన్స్ గా కీర్తి సురేష్, రష్మిక మందన్న నటిస్తారని తెలుస్తుంది. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి దర్శక ధీరుడు రాజమౌళి డైరక్షన్ లో చేస్తున్న ఈ మల్టీస్టారర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: