బాలీవుడ్ లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన శ్వేబాబసు ప్రసాద్ తర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగు లో కొన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి కొత్త బంగారు లోకం తో మంచి పేరు వచ్చింది. ఛాన్సులు లేక హై లెవల్ లైఫ్ స్టయిల్ కు అలవాటు పడిన నటీమణులు తమ ఆర్థిక అవసరాల కోసం వ్యభిచార కూపంలో ఇరుక్కుంటున్నారు. నటి శ్వేతాబసు ప్రసాద్ కూడా ఇలాగే వ్యభిచార ఉచ్చులో ఇరుక్కుంది. సిని చాన్స్ లు లేక ఐటమ్ గర్ల్కే పరిమితం కావడంతో.. దొరికిన ఛాన్సుల్ని చేసుకుంటూపోయిన శ్వేత ఆమధ్య సెక్స్ రాకెట్ కేసులో పట్టుబడి, కోర్టు నుంచి క్లీన్ చీట్తో బయటపడింది. ప్రస్తుతం ఈ అమ్మడు ముంబై ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ ఆఫీస్లో స్క్రిప్ట్ కన్సల్టెంట్గా కెరీర్ కొనసాగిస్తుంది.
ఇప్పటివరకు ప్రియుడి మాటెత్తని శ్వేతాబసు ప్రసాద్కు ఇటీవల ఓ యువకుడు తారసపడ్డాడు. దీంతో శ్వేతాబసుకు బాయ్ ఫ్రెండ్ దొరికేశాడు. అంతేకాకుండా ప్రేమలో పడిన వీరు డేటింగ్ మొదలెట్టారు. శ్వేతా బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు.. అనురాగ్ ఆఫీస్కి ఎక్కువగా వచ్చే చిన్న సినిమాల నిర్మాత, దర్శకుడు రోహిత్ మిట్టల్. ఇతగాడు ఆటో హెడ్ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడట. ఇద్దరి అభిరుచులూ ఒకేవిధంగా ఉండటంతో.. ఒకరికొకరు హ్యాపీగా ఎంచక్కా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. త్వరలో శ్వేత-రోహిత్ పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే సెక్స్ రాకెట్ పేరిట ఎంతో మానసిక ఒత్తిడి గురైన ఆమెకు రిలాక్స్ లభించినట్లవుతుంది.
కొన్ని రోజుల క్రితమే తమ నిశ్చితార్థం జరిగినట్టు శ్వేత స్వయంగా ప్రకటించింది. గోవాలో రోహిత్ కు తానే ప్రపోజ్ చేశానని, ఆ తర్వాత పూణెలో తన ప్రేమను రోహిత్ అంగీకరించాడని తెలిపింది. ఇంట్లోవాళ్లు కూడా తమ ప్రేమను అంగీకరించారని చెప్పింది. అయితే, తమ ఇద్దరి జీవితాలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను చెప్పుకోవాలని తాము భావించడం లేదని తెలిపింది. పెళ్లి ప్రస్తావనను అబ్బాయిలు మాత్రమే తెచ్చే రోజులు పోయాయని, ఇప్పుడు అమ్మాయిలు కూడా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం శ్వేత ఓ బాలీవుడ్ చిత్రంతో పాటు తెలుగులో 'గ్యాంగ్ స్టర్స్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.