సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే 35 కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టిన ఈ సినిమా రిలీజ్ అయిన సినిమాలేవి బాగా లేకపోవడంతో మహానటికి ఇంకా కలక్షన్స్ తగ్గడం లేదు. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన మహానటి సినిమా వైజయంతి బ్యానర్ లో అశ్వనిదత్ దత్ సమర్పణలో స్వప్న దత్, ప్రియాంకా దత్ నిర్మించారు.


ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందు 5,6 కోట్ల శాటిలైట్ ఆఫర్ రాగా సినిమా మీద నమ్మకం ఉన్న అశ్వనిదత్ ఆఫర్ ను కాదన్నాడట. ఇక రిలీజ్ అయిన వారం లోనే ఈ సినిమా శాటిలైట్ ఆఫర్ 11 కోట్ల దాకా వచ్చాయట. అప్పటికి ఇంకా వెయిట్ చేద్దామనుకున్న నిర్మాతలు ఫైనల్ గా స్టార్ మాకు 15 కోట్లకు మహానటిని ఇచ్చేశారట.


5 నుండి 15 కోట్లు అంటే 10 కోట్లు ఎక్కువ.. ఈ సినిమాకు అయిన ఖర్చు పాతిక కోట్లు కలక్షన్స్ ఇప్పటికే మంచి లాభాలను తీసుకురాగా సినిమా శాటిలైట్ తో చూస్తే ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ మూవీలో మహానటి ఒకటని చెప్పొచ్చు. అంచనాలకు మించి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారు.


కీర్తి సురేష్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ నటించారు. మిక్కి జే మేయర్ సంగీతం కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. మహానటి హిట్ తో సెట్స్ మీద ఉన్న బయోపిక్ సినిమాలకు ఇంకాస్త బాధ్యత పెరిగిందని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: