భారతీయ చలన చిత్ర రంగంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అందుకే ఆయనకు చలన చిత్రరంగంలో ప్రత్యేక స్థానం కల్పించబడింది. అయితే కమల్ తర్వాత అంత గొప్పగా ప్రయోగాలు చేసిన హీరో విక్రమ్ అనే చెప్పాలి. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి సినిమాల్లో విక్రమ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. తాను నటించిన ప్రతీ సినిమాలోను ఎదో ఒక వెరైటీ చూపిస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటాడు విక్రమ్.
ఇటీవల గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధ్రువ నట్చత్తిరమ్’ అనే సినిమా పూర్తి చేశాడు. ఈ మద్య గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధ్రువ నట్చత్తిరమ్’ అనే సినిమా పూర్తి చేశాడు. ఇందులో జాన్ అనే గూడా ఛారి పాత్రలో విక్రమ్ కనిపించాడు. 2003 లో విడుదలైన ‘ఆరు సామి’కి సీక్వెల్ లో నటిస్తున్నాడు. విక్రమ్ సరసన కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తుండగా, బాబి సింహా, ప్రభు, సూరి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. శిబు థామీన్స్ నిర్మాణంలో సామి2 రూపొందనుంది. దేవి శ్రీప్రసాద్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.
సినిమాటోగ్రాఫర్గా ప్రియన్, ప్రొడక్షన్ డిజైనర్గా మిలన్, స్టంట్ మాస్టర్గా కనల్ కన్నన్ సామి2 ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇందులో సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.ఈ సినిమాతో విక్రమ్ మరోసారి అదరగొడతాడని అంటున్నారు.ఆరు సామి బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా దీన్ని మేకర్స్ నిర్మించారు.