బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  బాలీవుడ్ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను ఇటీవలే పెళ్లాడిన బాలీవుడ్ నటి బిపాసాబసు అస్వస్థతకు గురైంది. గత కొంత కాలంగా ఆమె శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతుందని.. ముంబైలోని హిందూజా హెల్త్ కేర్ ఆసుపత్రిలో శనివారం నాడు చేర్పించినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆ సమస్యకు బిపాసా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. నిన్న బిపాసా తీవ్రంగా ఇబ్బందిపడడంతో ఆసుపత్రిలో చేర్పించారు. బిపాసాకు ముంబైకి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ కింజల్ మోదీ చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం బిపాసాకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిపాసాకు చికిత్స ప్రారంభించారని తెలుస్తోంది. మరికొన్ని రోజులపాటు బిపాసా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాల్సి వస్తుందని తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి బిపాసా భర్త గ్రోవర్ ఆమె కుటుంబ సభ్యులు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. బిపాసా బాలీవుడ్‌లోనే కాకుండా, తెలుగులో ‘టక్కరి దొంగ’ సినిమాలో మహేష్‌బాబుకు జోడీగా కనిపించారు.

బిపాసా త్వరలో తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. ఇదిలా ఉంటే..అయితే తాను ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగా చికిత్స తీసుకుంటున్నాన‌ని, త్వ‌ర‌లోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వ‌స్తాన‌ని బాలీవుడ్ భామ బిపాసా ట్వీట్ చేసింది. త‌న ఆరోగ్యం గురించి ఆరా తీసిన వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. బిపాసాకు మెరుగైన చికిత్స అందించడం జరుగుతుందని.. త్వరలోనే ఆమె కోలుకోవాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: