తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దగ్గుబాటి రానా. స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు మనవడు..సురేష్ బాబు తనయుడు అయిన రానా మొదటి చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లీడర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొదటి చిత్రం మంచి రెస్పాన్స్ వచ్చినా తర్వాత ఏ ఒక్క చిత్రం కూడా పెద్దగా ఆకర్శించలేకపోయింది. అయితే తెలుగు లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా రానా మంచి చిత్రాల్లో నటించాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో భళ్లాలదేవుడి గా ప్రతినాయకుడిగా నటించిన రానాకు జాతీయ స్థాయిలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. గత సంవత్సరం తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నేను రాజు నేను మంత్రి’ కూడా మంచి హిట్ అయ్యింది.
ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న రానా త్వరలో తన కుడి కన్ను ఆపరేషన్ చేయించుకోనున్నాడట. ఎప్పటి నుండో రానా కుడి కన్ను సరిగా కనిపించదు. ఈ విషయాన్ని ఓ షోలో కూడా చెప్పాడు . అయితే కొన్ని వారాలు షూటింగ్కి బ్రేకప్ ఇచ్చి యూఎస్లో కంటి ఆపరేషన్కి రానా వెళ్ళనున్నాడని సురేష్ బాబు ఇటీవల ఓ ఇంగ్లీష్ మీడియాకి చెప్పారు. ప్రస్తుతం రానా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత నేపధ్యంలో ‘1945’ అనే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేయనున్నాడు .
ఇదే కాక పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రంలో కేరళ ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ వర్మ పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కాలంలో రిలీజ్ కాబోతుంది. బాల డైరెక్షన్లోను రానా ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. వీటి తర్వాత నేనే రాజు నేనే మంత్రి వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తేజ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు రానా. ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో రానా ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించనున్నాడని అంటున్నారు.