ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో యువ దర్శకుల హవా బాగా పెరిగిపోయింది.  ఇక దర్శకధీరుడు రాజమౌళి పుణ్యమా అని బాహుబలి సీరీస్ తో జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో తెలుగు చిత్రాల ఘనత ఎంతో ఎత్తుకు ఎదిగింది.  అంతే కాదు కొత్త కొత్త కాన్సెప్ట్ ల తో యువ దర్శకులు కూడా అద్భుతమైన చిత్రాలు తెరకెక్కిస్తున్నారు.

గత సంవత్సరం సంపత్ వంగ ‘అర్జున్ రెడ్డి’, ఈ సంవత్సరం నాగ్ అశ్విన్ ‘మహానటి’తో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించారు.  అయితే వంశీ పైడిపల్లి తన ఇంట్లో సోమవారం రాత్రి ఓ పార్టీని నిర్వహించగా, ప్రముఖ దర్శకులంతా హాజరయ్యారు. వీరంతా కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్న వంశీ పైడిపల్లి, "అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను" అని క్యాప్షన్ పెట్టాడు.

ఈ కార్యక్రమంలో జమౌళి, సుకుమార్‌, క్రిష్‌, కొరటాల శివ, హరీశ్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, నాగ్‌ అశ్విన్‌, సందీప్‌ వంగవీటి, వంశీ పైడిపల్లి ఉన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి తన ఇంటికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలని వంశీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వీరంతా తమతమ చిత్రాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి షేర్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: