బాలీవుడ్ లో ఎప్పుడో మొదలైన మల్టీస్టారర్ ట్రెండ్ ఇప్పుడు తెలుగులో కొనసాగుతుంది. దశాబ్ధాల తర్వాత వెంకటేష్, మహేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మల్టీస్టారర్ సినిమాలకు కొత్త ఉత్సాహం వచ్చింది. 


ఇప్పుడు మెగా నందమూరి కాంబినేషన్ లో మూవీ వస్తుంది. ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి సినిమా చేస్తున్నారు. రాజమౌళి డైరక్షన్ లో ఈ మూవీ వస్తుంది. అక్టోబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఇక ఈ సినిమానే కాదు వెంకటేష్, నాగ చైతన్య కలిసి ఓ సినిమా చేస్తున్నారు. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.  


బాబి డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాకు టైటిల్ గా వెంకీ మామా అని పెడుతున్నారట. ఈ సినిమాలో వెంకటేష్ సరసన నయనతార, చైతుకి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారని తెలుస్తుంది. జై లవ కుశ తర్వాత బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.


ఇదే కాకుండా విక్టరీ వెంకటేష్ మెగా హీరో వరుణ్ తేజ్ తో కూడా మరో సినిమా చేస్తున్నాడు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఎఫ్-2 గా ఈ సినిమా రాబోతుంది. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ క్యాప్షన్ తో ఈ సినిమా వస్తుంది. వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న అనీల్ ఈ సినిమాను కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: