అప్పట్లో బాపు తీసిన చిత్రాలు ఎన్నో సూపర్ హిట్ గా నిలిచాయి.  మనసుకు హత్తుకునే చిత్రాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి.  ఈ నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘రాంబంటు’. రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఈశ్వరీరావు.  ఆ తర్వాత తెలుగు లో పెద్దగా ఛాన్స్ లు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఎన్నో చిత్రాల్లో నటించారు. 

తాజాగా పా రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘కాలా’ చిత్రంలో ఈశ్వరీరావు మంచి పాత్రలో నటిస్తున్నారు.  ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్.  ఈ సందర్భంగా ఈశ్వరీరావు మాట్లాడుతూ..ఓ రోజు ‘కాలా’ చిత్రం యూనిట్ నుంచి నాకు ఫోన్ వచ్చింది..ఈ చిత్రంలో మీకు మంచి పాత్ర ఉంది చేస్తారా అన్ని అన్నారు. 

మొదట నేను ఆశ్చర్యపోయాను..కాలా చిత్రంలో రజినీకాంత్ నటిస్తున్నారు..అంత పెద్ద చిత్రంలో నాకు ఎలాంటి పాత్ర ఉంటుందో అని ఆలోచించారు.. తర్వాత చెప్పారు నేను రజినీ కాంత్ భార్యగా నటించాలని. ఒక్కసారే నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  ఈ చిత్రంలో ‘బంగారు బొమ్మా’అంటూ పాట పాడుతారు..అప్పటి నుంచి రజినీకాంత్ నన్ను బంగారు బొమ్మా అని పిలవడం మొదలు పెట్టారు.

నిజానికి నా జీవితంలో రజినీకాంత్ పక్కన నటిస్తానా అన్న సందేహాలు ఉండేవి..కానీ ఈ చిత్రంతో ఆ కోరిక తీరింది. ఈ చిత్రం విడుదల కోసం నేను వెయి కన్నులతో ఎదురు చూస్తున్నాను అని అన్నారు ఈశ్వరీరావు. 


మరింత సమాచారం తెలుసుకోండి: