ఈ మద్య శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం చేసిన సమయంలో ఆమెకు సపోర్ట్ గా నిలిచిన వారిలో సినీ నటి అపూర్వ ఉన్నారు.  ఆ మద్య కొన్ని ఛానల్స్ లో అపూర్వ మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని..కొంత మంది దళారులు నటించడానికి వచ్చిన అమ్మాయిలపై దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. 

తాజాగా నటి అపూర్వ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.  తన వ్యవసాయ భూమిని కబ్జా చేశారంటూ సినీ నటి అపూర్వ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, దెందులూరులో తనకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. ఇటీవలే తమ భూమిని సర్వేయర్ తో సర్వే చేయించి సరిహద్దుల్లో రాళ్లు పాతించామని చెప్పారు. 

తాను మరుసటి రోజు అక్కడికి వెళ్లే సమయానికి రాళ్లు పక్కన పడేసి అంతా కబ్జా చేసుకున్నారని ఆరోపించింది. ఈ కబ్జా వ్యవహారంపై పోలీసులు మాట్లాడుతూ, ఇది సివిల్ వ్యవహారమని, భూమి సరిహద్దుల విషయాన్ని ఎమ్మార్వో చూసుకుంటారని చెప్పారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి, సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: