టాలీవుడ్ లో ఎలాంటి వివాదాలు తెరపైకి వచ్చినా వెంటనే స్పందిస్తుంటారు ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో సైతం మంచి కలెక్షన్లు రాబడుతుంది. తెలుగు తెరపై మొదటి సారిగా అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన సినిమా ‘మహానటి’. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కి అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చిపడ్డాయి. అంతే కాదు ఈ సినిమాలో అందరు పెద్దనటులే ఉండటంతో సినిమాకు మరింత వన్నె వచ్చింది.
సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వత తెరపైకి జెమినీ గణేషన్ మొదటి భార్య కూతుళ్లు ఇందులో తమ తండ్రి పాత్రను తప్పుగా చూపించారంటూ గొడవకి దిగారు. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి తనదైన శైలిలో వాళ్లకి సమధానమిచ్చింది. అప్పటి వరకు మహానటి సావిత్రి బయోపిక్ లో అన్ని పర్ఫెక్ట్ గా చూపించారనుకున్న ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. "దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించాడు. సావిత్రి పాత్రను ఆయన ఆవిష్కరించిన తీరు అద్భుతం.
ఒకటి రెండు సీన్స్ మినహా జెమినీ గణేశన్ పాత్రను కూడా పాజిటివ్ గానే చూపించాడు. అంతే కాదు జెమినీ గణేషన్ మొదటి భార్య పాత్రను కూడా ఎంతో గొప్పగా చిత్రీకరించారు..ఎక్కడ కూడా ఆమె స్థాయి తగ్గకుండా తెరకెక్కించారు దర్శకులు... ఈ విషయాన్ని జెమినీ గణేశన్ కూతుళ్లు గమనించాలి.
అయితే సినిమా అన్న తర్వాత కొన్ని కల్పిత సన్నివేశాలు ఉండటం సహజమని..అలా అని అన్నీ నెగిటీవ్ గా తీసుకోవొద్దని అన్నారు. ఒక మంచి సినిమాను చూశామని అనుకోవాలే గానీ .. ఒకరినొకరు తిట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటివరకూ కలిసున్న మీరు ఈ కారణంగా విడిపోవడం మాకు ఇష్టం లేదు" అని చెప్పుకొచ్చారు.