తమిళనాడులో ఈ మద్య పెను సంచలనాలకు కేంద్రంగా నిలిచింది తుత్తుకూడి సంఘటన. భూగర్భ జలాలు కలుషితమవడానికి కారణమవుతున్న తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటికోరిన్) స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. కాల్పుల్లో 11 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ఘటనని తమిళ సినీ పరిశ్రమ పూర్తిగా ఖండించింది.
తమిళ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ బాధితులని పరామర్శించి వారికి మద్ధతుగా నిలిచారు. బాధితులు ఒక్కొక్కరికి రెండు లక్షలు సాయం చేయనున్నట్టు రజనీకాంత్ ఇటీవల ప్రకటించారు. తమిళనాడులో ఎలాంటి విపత్తు సంబవించినా సినీ పరిశ్రమ ముందుగా స్పందిస్తుంది..బాధితులకు తగినంత సహాయ సహకారాలు అందిస్తారు.
తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ తూత్తుకుడి బాధితులను పరామర్శించారు. అర్థరాత్రి తూత్తుకుడికి బైక్పై వెళ్లి బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. అందరిని పేరు పేరున పలకరించి వారికి మద్ధతుగా ఉంటానని చెప్పాడట. ఈ విషయం కాస్త లీక్ అయ్యేలోపే చెన్నై చేరుకున్నారు. ఈ మద్య ప్రచార ఆర్భాటాలకు వెళ్లే నాయకులు, సెలబ్రెటీలు ఎంతో మంద ఉన్నారు..కానీ విజయ్ మాత్రం ఎవ్వరికీ తెలియకుండా తన మంచి మనసు చాటుకున్నారని..ఆయన దాతృత్వం అందరికి ఆదర్శవంతంగా ఉంటుందని తమిళ తంబీలు అంటున్నారు.