ఈ మద్య బాలీవుడ్ లో స్టార్ హీరోల వారసుల వివాహమహోత్సవాలు కనుల విందుగా సాగుతున్నాయి. సోనమ్ కపూర్, నేహా ధూపియాలు గత నెలలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా కొత్త బంగారు లోకం సినిమా హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ కూడా త్వరలోనే బాలీవుడ్ దర్శకుడిని వివాహం చేసుకోనున్నట్లు చెప్పి అందరినీ షాక్ ఇచ్చింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రబర్తి తనయుడు మహాక్షయ్ చక్రవర్తిని పెళ్లాడబోతోందట మదాలస శర్మ.
ఒకటీ రెండు తెలుగు, కన్నడ సినిమాల్లో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించింది మదాలస. సరైన హిట్స్ లేక కెరీర్ సాగించలేకపోయిన ఈమె.. ఏకంగా ఒక బిగ్ షాట్ కొడుకును పెళ్లి చేసుకోబోతుండటం విశేషం. తను మిథున్ చక్రబర్తి తనయుడిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా మదాలస ప్రకటించింది. మహాక్షయ్ చక్రవర్తితో జూలై 7న తన వివాహం జరగనున్నట్లు మదాలస శర్మ తెలిపారు.
ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మదాలస.. ‘మూడేళ్లుగా నేను, మహాక్షయ్ రిలేషన్షిప్లో ఉన్నాం. మా రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో ఈ విషయాన్ని చెప్పగానే వారేమీ అభ్యంతరం తెలపలేదు. వారి అంగీకారంతోనే మార్చి నెలలో మహాక్షయ్ ఇంట్లో మా ఎంగేజ్మెంట్ జరిగింది. అందుకే ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోవచ్చు అని అన్నారు.
కాగా 2008లో ‘జిమ్మీ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహాక్షయ్కు.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ప్రస్తుతం పెద్దగా అవకాశాలేమీ రావడం లేదు. అదే విధంగా 2011లో ‘ఏంజెల్’సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయమైన మదాలస.. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లో కూడా నటించారు.