ఈసంవత్సరం ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో ‘రంగస్థలం’ స్థాయిలో విజయం సాధించిన సినిమాలు ఇప్పటి వరకు విడుదల కాలేదు. కథతో ప్రేక్షకులను మెప్పించగలిగితే ఎలాంటి కలక్షన్స్ సునామీ వస్తుందో ‘రంగస్థలం’ నిరూపించింది. తెలుగు ప్రేక్షకులు పీరియాడిక్ థీమ్ తో తీసే సినిమాలను బాగా ఇష్టపడతారు అన్న విషయం స్పష్టమైంది. 
Ram Charan New Rangasthalam Movie Latest Stylish ULTRA HD Photos Stills Images
దీనితో ఇలాంటి జోనర్ లో సినిమాలు తీసే ప్రయత్నాలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాల జరుగుతున్నాయి. సక్సస్ బాటలో పయనిస్తున్న శర్వానంద్ తో ‘రంగస్థలం 2’ ప్రయోగానికి సంబంధించిన ఆసక్తికర వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి. ప్రస్తుతం శర్వానంద్ సాయిపల్లవితో కలిసి ‘పడిపడి లేచె మనసు’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈమూవీ ఒక వెరైటీ లవ్ స్టోరీ అని అంటున్నారు. ఈసినిమా ఇంకా విడుదల కాకుండానే శర్వానంద్ సాయి పల్లవి లను కలిపి మరో ప్రాజెక్ట్ నిర్మాణంలోకి రాబోతోంది. ‘నీదినాది ఒకే కథ’ దర్శకుడు వేణు ఊడుగుల ఒక వెరైటీ కథను శర్వానంద్ కు చెప్పి ఒప్పించాడు అని వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు ‘విరాట పర్వం 1992’ అనే టైటిల్ పెడుతున్నట్లు సమాచారం.
Sai Pallavi Stills At Fidaa Movie Launch-7
1990ల కాలంలో ఉండే ఒక పల్లెటూరి నేపథ్యంతో ఈకథ సాగుతుందట. 1980ల కాలాన్ని ‘రంగస్థలం’ లో చూపెడితే 1990 కాలాన్ని ఈ సినిమాలో చూపెడతారని తెలుస్తోంది. ఈమూవీలో సాయి పల్లవికి ఒక పవర్ ఫుల్ పాత్రను క్రియేట్ చేసినట్లు టాక్. ఇప్పుడు ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో ‘రంగస్థలం’ పార్ట్ 2కు రంగం సిద్ధం అవుతోందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనినిబట్టి చూస్తుంటే రానున్న రోజులలో చాలామంది హీరోలు విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: