ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాలు వరుసగా సిద్దమవుతున్నాయి.  ఇప్పటికే అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ చిత్రం తెరకెక్కించారు.  ఈ చిత్రం అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది.  దాంతో తెలుగు ఇండస్ట్రీలో మరిన్ని బయోపిక్ చిత్రాలు తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో  ఎన్టీఆర్ .. వైఎస్సార్ .. కాంతారావు .. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి .. కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ లు లైన్లో వున్నాయి. అయితే కోడీ రామ్మూర్తి నాయుడు, స్టూవర్టుపురం గజదొంగ పేరు తెచ్చుకున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ కథ ఆధారంగా మరో బయోపిక్ తీయడానికి రానా ఒప్పుకున్నారట.  కానీ గతంలో కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకున్న సందర్భంగా 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్   నుంచి రానా తప్పుకున్నారట.

ఎన్నో బ్యాంకులను కొల్లగొట్టిన టైగర్ నాగేశ్వరరావు .. చివరికి ఒక భారీ ఎంకౌంటర్లో చనిపోయాడు. ఆయన బయోపిక్ నుంచి రానా తప్పుకోవడంతో, దర్శక నిర్మాతలు నానిని సంప్రదించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు.  ఈ చిత్రానికి ‘కిట్టుఉన్నాడు జాగ్రత్త’ దర్శకుడు వంశీ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నారని టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: