ప్రిన్స్ మహేష్ బావ సుధీర్ బాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా హీరోగా నిలదొక్కుకోలేక పోతున్నాడు. మహేష్ స్వయంగా సుధీర్ బాబు సినిమాలను ప్రమోట్ చేస్తూ ఉన్నా మహేష్ అభిమానులే సుధీర్ బాబును పట్టించుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థుతులలో క్రియేటివ్ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చే వారం విడుదల కాబోతున్న ‘సమ్మోహనం’ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ పై ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు హడావిడి చేస్తోంది.  
Sudheer Babu and Aditi Rao Hydari
ఈ మూవీలో కామెడీ బాగానే పేలుతుందట. ఈ కామెడీలో భాగంగానే రివ్యూలు ఛానల్స్ వెబ్ సైట్ల మీద సెటైర్లు వేశాడట డైరెక్టర్. వీటిలో చాలావరకు ఛానళ్లు మీడియాను టార్గెట్ చేసే ఉంటాయని పైగా ఆ సెటైర్లు కూడా బాగానే పేలాయని అంటున్నారు. ఈమూవీలో హీరోయిన్ అదితి రావు పాత్రను సినిమా హీరోయిన్ గా చూపుతూ ఇండస్ట్రీని హైలైట్ చేస్తూనే మరోవైపు మీడియాను విపరీతంగా ఇంద్రగంటి తన డైలాగ్స్ సెటైర్లతో టార్గెట్ చేసాడని తెలుస్తోంది. 
Sammohanam: Sudheer Babu, Aditi Rao Hydari wrap film shoot; Latest stills
ఇంద్రగంటి పై ఉన్న నమ్మకంతో ఈ సినిమాను కొందామని అనుకున్న ఒక బడా ఛానల్ యాజమాన్యం ఈసినిమాలోని మీడియా పై సెటైర్లను చూసి షాక్ అయి ఇంద్రగంటిని తమ వద్దకు పిలిపించుకుని ఆ ఛానల్ యాజమాన్యం ఇంద్రగంటికి పెద్ద క్లాస్ పీకినట్లు టాక్.  ఒక చిన్న సినిమాని తాము డబ్బు ఇచ్చి కొనుక్కుని తమ ఛానల్  పై తామే సెటైర్లు వేయించుకోవాలా అంటూ ఆ ఛానల్ యాజమాన్యం ఇంద్రగంటికి ప్రశ్నలు వేసినట్లు సమాచారం. 
Image may contain: 3 people, people standing and outdoor
ఈ సీన్స్ ను తీసివేసినప్పుడు మాత్రమే తాము ఈసినిమాను కొంటామని లేదంటే ఈమూవీ పై వ్యూహాత్మకంగా ఛానల్స్ అన్నీ నెగిటివ్ ప్రచారం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోమని ఇంద్రగంటికి సున్నితంగా హెచ్చరికలు ఇచ్చినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. అయితే ఈసీన్స్ ‘సమ్మోహనం’ సినిమాకు కీలకం కావడంతో ఆ సీన్స్ తొలిగించే విషయంలో ఇంద్రగంటి అంగీకరించడం లేదు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తన సినిమాలు అన్నీ వరస ఫెయిల్యూర్స్ గా మారుతున్న పరిస్థుతులలో ఈకొత్త సమస్యలు తన సినిమాకు ఏమిటి అని సుధీర్ బాబు తల పట్టుకుంటున్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: