ఈ మద్య సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలకు వరుసగా ప్రమాదాలు సంబవిస్తున్నాయి..ఆ మద్య నాని షూటింగ్ నుంచి వస్తూ..కారు ప్రమాదం జరిగింది..గతంలో బాలకృష్ణ బెంగుళూర్ నుంచి వస్తున్న సమయంలో కార్ యాక్సిడెంట్ జరిగింది..కాకపోతే ఈ ప్రమాదంలో వారికి పెద్దగా గాయాలు మాత్రం కాలేదు. తాజాగా కన్నట కంఠీరవ రాజ్‌కుమార్ తనయుడు, యువ నటుడు పునీత్ రాజ్‌కుమార్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘నట సార్వభౌమ’ చిత్రంతో నటిస్తున్నాడు. 

‘నట సార్వభౌమ’ సినిమా షూటింగ్ అనంతరం బళ్లారి నుంచి బెంగళూరుకు తన రేంజ్ రోవర్ కారులో వెళ్తుండగా అనంతపురం వద్ద కారు టైరు ఒక్కసారిగా పంక్చరై అదుపుతప్పింది.  అదృష్టం కొద్ది ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని పునీత్ ట్విట్టర్ ఖాతా నిర్ధారించింది.

అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారని తెలిపింది. సోషల్ మీడియా, న్యూస్ చానెళ్లలో వచ్చే పుకార్లను నమ్మవద్దని పునీత్ కార్యాలయ సిబ్బంది ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: