మాటల మాంత్రికుడు త్రివిక్రం సూపర్ స్టార్ మహేష్ ఇద్దరు కలిసి చేసిన అతడు మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఆ సినిమా టివిలో ఎప్పుడు వచ్చినా చూసేస్తారు ఆడియెన్స్. ఇక ఆ తర్వాత ఖలేజా వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. ఇది కూడా బుల్లితెర మీద మంచి సక్సెస్ అయ్యింది.


ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ అని కొన్నాళ్లుగా ఇండస్ట్రీ టాక్. త్రివిక్రం సినిమా అంటే ఉంటే పవన్ లేదంటే మహేష్ ఈ ఇద్దరు కుదరకపోతే బన్ని. అయితే మొదటిసారి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు త్రివిక్రం. ఫస్ట్ లుక్ తోనే ఆ సినిమాపై అంచనాలు పెంచేశాడు. 


అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా చేయడం ఓ సాహసమే. ఈ సినిమా తర్వాత అసలైతే మహేష్ తో సినిమా ఉండాల్సింది కాని మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో సినిమా లైన్ లో పెట్టాడు. ఈ రెండిటి తర్వాత కూడా అర్జున్ రెడ్డి డైరక్టర్ తో షుగర్ ఫ్యాక్టరీ అంటూ సినిమా చేస్తాడని టాక్.


ఇలా వరుసగా తన డేట్స్ ఫిల్ చేసుకున్న మహేష్ త్రివిక్రం కోసం మాత్రం టైం కేటాయించలేకపోతున్నాడట. అంతేకాదు ఓ పక్క రాజమౌళి కూడా మహేష్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. బాహుబలి తర్వాత మెగా నందమూరి మల్టీస్టారర్ షురూ చేసిన రాజమౌళి ఆ తర్వాత సినిమా మహేష్ తోనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: