తెలుగు ఇండస్ట్రీలో  ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో పోటీ పడి నటించి గొప్ప పేరు తెచ్చుకున్న మహానటి సావత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన మహానటి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు..సావిత్రి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని...అప్పటికే రెండు వివాహాలు చేసుకున్న జెమినీ గణేషన్ ని పెళ్లి చేసుకోవడంతో ఆమె జీవింతో ఎన్నో కష్టాలు అనుభవించిందని రూమర్లు వచ్చాయి. 
Image result for gemini ganesan
అయితే ‘మహానటి’ చిత్రంలో ఆమె జీవితం గురించి తెలుసుకున్న తర్వాత ఆ అపోహలు కొంత వరకు దూరం అయ్యాయని చాలా మంది అంటున్నారు.   గత నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల షేర్ ను వసూలు చేసింది. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తూ ఉండటం విశేషం.

మూవీలో కీర్తీ సురేష్ సావిత్రి పాత్ర‌లో న‌టించ‌గా, స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప్ర‌కాష్ రాజ్, మోహ‌న్ బాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్, నాగ చైత‌న్య‌, షాలినీ పాండే త‌దిత‌రులు న‌టించారు.. స్వ‌ప్న ద‌త్, ప్రియాంకా ద‌త్ లు ఈ మూవీకి నిర్మాత‌లు. అయితే ‘మహానటి’చిత్రం ముందుగా ఎక్కువ నిడివి ఉండేలా చూశారు..కానీ థియేటర్లో అంత పెద్ద సినిమాను ఆదరిస్తారన్న అనుమానాలు రావడంతో చాలా వరకు సీన్లు డిలీట్ చేశారు.

ఈ మద్య డిలీట్ చేసిన కొన్ని సీన్లు యూట్యూబ్ లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా జెమినీగణేషన్ ముగ్గురు భార్యలు అలివేలు,పుష్పవల్లి, సావిత్రి ఒకే సీన్లో కనిపించడం..వారి పిల్లలు కూడా ఒకేసారి సీన్లో కనిపించడం..మొత్తానికి జెమినీ గ‌ణేష‌న్ కుబుంబం అంతా క‌లిసి ఉండే సీన్స్ వీడియోను రిలీజ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: