యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఎలాంటి పాత్రనైనా సరే అవలీలగా చేయగల నటుడు. తారక్ కోసం ఎన్నో అద్భుతమైన పాత్రలను దర్శకులు క్రియేట్ చేస్తుంటారు. ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు తారక్. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో మూవీ లైన్ లో ఉంది.


ఆ సినిమాలో ఎన్.టి.ఆర్ తో పాటుగా రాం చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. సినిమాలో ఇద్దరు అన్నదమ్ములుగా నటిస్తున్నారని తెలుస్తుంది. ఇక సినిమా నుండి లీకైన కథ ప్రకారం ఇందులో రాం చరణ్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడట. ఇక తారక్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడని అంటున్నారు.


ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఎన్.టి.ఆర్ ను రాజమౌళి విలన్ గా చూపిస్తున్నాడేమో అన్న డౌట్ మొదలైంది. గ్యాంగ్ స్టర్ గా తారక్.. అదే సినిమాలో పోలీస్ గా రాం చరణ్ అంటే.. ముందు విలన్ గా కనిపించే ఎన్.టి.ఆర్ పరిస్థితుల కారణంగా చేంజ్ అవుతాడేమో అని అంటున్నారు.


ఈ లెక్కన చూస్తే మల్టీస్టారర్ సినిమాలో ఎన్.టి.ఆర్ విలన్ గా చూపించేస్తున్నారని నందమూరి ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అక్టోబర్ నుండి మొదలైన ఈ సినిమా 2020 సమ్మర్ లో రిలీజ్ చేసేలా చూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: