సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పి లైంగికంగా లోబరచుకొని సినిమాలో ఒక చిన్న పాత్రకూడా ఇవ్వకుండా అమాయక ఆడపిల్లలను మోసం చేస్తున్న ఇండస్ట్రీలోనిచీకటి శక్తులను నిర్ములించాడనికి ఒక పోరాటాన్ని కొనసాగిస్తున్నది శ్రీ రెడ్డి. ఇన్నాళ్లు ఒక క్రమ పద్దతిలో సాగిన ఆమె పోరాటం ఒక్కసారిగా పవన్ కల్యాణ్ ను విమర్శించడంతో మొత్తం నీరుగారిపోయింది. 


ఇక అప్పటినుండి సోషల్ మీడియాలో తన వివాదాస్పద పోస్టులు చేస్తూ వస్తుంది. అయితే త్వరలో ప్రసారం కానున్న బిగ్ బాస్ కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. ఆమె స్పందిస్తూ "బ్యాడ్ న్యూస్ మై ఫ్రెండ్స్. ప్రమాణం చేస్తున్నా. ఇది నా దురదృష్టం. నేను బిగ్‌బాస్ షోలో పాల్గొనడం లేదు. ఈ వార్తతో కొంతమంది సంతోషపడతారని, మరికొంత మంది భాదపడతారని తెలుసు. బిగ్‌బాస్ టీం కి అల్ ది బెస్ట్" అంటూ రాసుకొచ్చింది.


కాగా ఇటీవల జరిగిన వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ఇటీవల ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు తనని కలచివేశాయని, ఈ సమయంలో తన గురువుగారయిన దాసరి నారాయణరావు లాంటి పెద్ద దిక్కు ఉంటే బావుంటుందని వాఖ్యానించారు. దీనికి ఫేసుబుక్లో  స్పందించిన ఆమె మొహన్ బాబుని ఉద్దేశిస్తూ..ఇండస్ట్రీకి మీరే పెద్ద అయితే బావుంటుందని, పెద్దరాయుడని రాసుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: