సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమా తర్వాత చేస్తున్న వంశీ పైడిపల్లి సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో మహేష్ లుక్ కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈమధ్యనే తన గడ్డం లుక్ తో అందరిని సర్ ప్రైజ్ చేశాడు మహేష్. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.


ఈ సినిమాలో మరో హీరో అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. లీకైన కథ ప్రకారం సినిమాలో మహేష్ పెద్దింటి కుర్రాడిగా.. నరేష్ పేదోడిగా నటిస్తున్నాడని అన్నారు. కాని లీకైన పిక్స్ చూస్తుంటే మహేష్ పేదోడిగా నటిస్తున్నాడని తెలుస్తుంది. అవును నిజమే మహేష్ తన కెరియర్ లో మొదటిసారి ఓ సగటు మధ్యతరగతి మనిషిగా కనిపించబోతున్నాడట. 


రాజకుమారుడు నుండి భరత్ అనే నేను వరకు మహేష్ చేసిన పాత్రలన్ని వేరు కాని ఈసారి మహేష్ 25వ సినిమాగా నిజంగానే కొత్తగా కనిపిస్తాడట. పేదోడుగా మహేష్ అనగానే ఫ్యాన్స్ లో ఓ కొత్త ఎక్సైట్మెంట్ మొదలైంది. వంశీ పైడిపల్లి రాసిన ఈ సినిమా కథ ఎంతో అద్భుతంగా వచ్చిందట.


దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇప్పటికే సాంగ్స్ అన్ని పూర్తి చేశాడట. పూజా హెగ్దె హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. 2019 సంక్రాంతికి ఇది రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పొంగల్ వార్ అంటే మహేష్ కు మంచి సెంటిమెంట్ మరి ఆ టైంకు ఇది వస్తుందో రాదో చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: