ఈరోజు ప్రారంభం కావలసిన నాని ‘బిగ్ బాస్ 2’ షో ఇంకా ప్రారంభం కాకుండానే నాగార్జునకు నాని విషయంలో ఒక ఊహించని షాక్ తగిలింది అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జున నానీతో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం చాల వేగంగా జరుగుతోంది. 
Nagarjuna, Nani
అయితే ఆశ్చర్యకరంగా ఈమూవీలో నటించినందుకు నాగార్జునకు నాలుగు కోట్ల పారితోషికం నిర్మాతలు ఇస్తే ఇదే మూవీలో నాగ్ తో కలిసి నటిస్తున్న నానీకి 8 కోట్ల పారితోషికం ఇచ్చారు అన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి కారణం వరస విజయాలతో దూసుకుపోతున్న నానీ క్రేజ్ అని అంటున్నారు. 

నానీ లేటెస్ట్ మూవీ ‘కృష్ణార్జున యుద్ధం’ ఫెయిల్ అయినా నానీ మార్కెట్ పై ఎటువంటి ప్రభావం చూపించని నేపధ్యంలో నానీకి ఈ రేంజ్ లో పారితోషికం ఇచ్చారు అని టాక్. దీనికితోడు వరస పరాజయాలతో సతమతమైపోతున్న నాగార్జున క్రేజ్ తగ్గడం కూడ ఇలా తక్కువ పారితోషికాన్ని నాగార్జునకు ఇవ్వడం వెనుక కారణం అని అంటున్నారు. 

అదేవిధంగా ఈ మల్టీ స్టారర్ లో నాగార్జున పాత్ర కంటే కొద్దిగా ఎక్కువగా నానీ పాత్ర ఉండేడట్లుగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈమూవీ కథను డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బయ్యర్లలో నాగ్ సినిమాల వైపు క్రేజ్ బాగా తక్కువగా ఉన్న నేపధ్యంలో కేవలం నానీ ఇమేజ్ తో ఈ మల్టీ స్టారర్ ను మార్కెట్ చేయబోతున్నట్లు సమాచారం. దీనికితోడు ఈరోజు నుంచి ప్రారంభంకాబోతున్న ‘బిగ్ బాస్ 2’ సీజన్ సూపర్ సక్సస్ అయితే నాని క్రేజ్ నాగార్జున నానీల మల్టీ స్టారర్ కు వరంగా మారబోయే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: