త్రివిక్రమ్ కు అజ్ఞాతవాసి ఫ్లాప్ తరువాత తన ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. స్టార్ హీరోలతో పని చేయడం వల్లన తను అనుకున్న కథను సరిగా చెప్పలేనేమో అని త్రివిక్రమ్ కు అర్ధం అయినట్టుంది. స్టార్ హీరో ఉన్నప్పుడు కథతో సంభందం లేకుండా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాల్సిందే. దాని వల్లన కథ దారి తప్పి మొదటికే మోసం వస్తుంది. అందుకే త్రివిక్రమ్ మిడిల్ హీరోలు అయితే బాగుటుందని ఫిక్స్ అయ్యాడు.
అజ్ఞాతవాసి కంటే ముందే కమిట్ అవడం వల్ల ఎన్టీఆర్ చిత్రాన్ని చేస్తున్నాడు కానీ కొంతకాలం స్టార్ హీరోలకి దూరంగా వుండాలని త్రివిక్రమ్ డిసైడయ్యాడు. యువ హీరోలతో తనకి నచ్చిన కథలతో సినిమాలు చేయాలని, ఫలానా హీరో ఇమేజ్కి అనుగుణంగా సినిమాలు తీయడం తగ్గించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే 'అరవింద సమేత' తర్వాతి చిత్రాన్ని నాని హీరోగా త్రివిక్రమ్ చేయబోతున్నాడు. మిడిల్ రేంజ్లో ఇంకా చాలా మంది టాలెంటెండ్ హీరోలు వుండడంతో వారితో వరుసగా కొత్త రకం కథలని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడు.
మధ్యమధ్యలో స్టార్ హీరోలతో చేసినా కానీ ఇక మీదట కేవలం స్టార్లకే పరిమితం కాకూడదని, దాని వల్ల తన ఆలోచనలు, సినిమాలు కూడా పరిమితం అయిపోతున్నాయని ఆయన భావిస్తున్నాడు. త్రివిక్రమ్ స్థాయి దర్శకుడు పంథా మార్చి యువకులతో పని చేస్తే మరింత మంది టాప్ రేటెడ్ డైరెక్టర్లు ఈ రూట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనుక ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే.