నిన్నటి రోజున ఎన్నో భారీ అంచనాలతో నాని హోస్ట్‌గా ప్రారంభం అయిన ‘బిగ్ బాస్ 2’ కార్యక్రమం అత్యంత ఘనంగా ప్రారంభం అయింది. ఈషోకు సంబంధించిన మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ నిర్వాహణలో భారీ సక్సస్ ను అందుకోవడంతో నిన్నటి కార్యక్రమంలో నాని ఈషో ప్రజంటర్ గా ఎలా ఉంటాడు అన్న ఆతృత అందరిలోనూ ఉండటంతో నిన్నటి ‘బిగ్ బాస్ 2’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ రేటింగ్స్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఫస్ట్ కంటెస్టెంట్ గీతా మాధురి
మొదటి నుంచి నాని ఈకార్యక్రమానికి సంబంధించి చెపుతున్నట్లుగానే తన సొంత బాడీ లాంగ్వేజ్ తో అదేవిధంగా తన సొంత మూమెంట్స్ తో ఈకార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నించాడు. అయితే నాని ఈకార్యక్రమం గురించి చాల కష్టపడినట్లు కనిపించినా ఎక్కడో సహజత్వం అదేవిధంగా ఈకార్యక్రమ కంటెస్టంట్స్ తో నాని  జూనియర్ లా అత్యంత ఆత్మీయంగా ఉండలేకపోయాడు అన్న కామెంట్స్ ఈ షో మొదటిరోజునే వచ్చాయి. అయితే ఈకార్యక్రమం ఇంకా 105 రోజులు జరుగుతుంది కాబట్టి నానీ తన తీరును ఇంకా మెరుగు పరుచుకునే ఆస్కారం ఉంది. 
షాకిచ్చిన బాబు గోగినేని
నాని తన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగులకు డాన్స్ చేస్తూ అదిరిపోయే ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ‘బిగ్ బాస్‌’ కు ఇంత క్రేజ్ రావడానికి కారణమైన మొదటి సీజన్ అద్భుతంగా హోస్ట్ చేసిన ‘తారక్ అన్నయ్యకు థాంక్స్’ అంటూ జూనియర్ అభిమానులను ఆకర్షించడానికి ప్రయత్నించాడు. ఇక ఈషోలో ఎవరూ ఊహించని కొంతమంది ఎంట్రీ ఇవ్వడం చాల మందిని ఆశ్చర్య పరిచింది. ప్లేబ్యాక్ సింగర్‌ గీతా మాధురి బిగ్ బాస్ ఇంట్లోకి తొలి కంటెస్టెంటుగా ఎంట్రీ  ఇచ్చింది. తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు చేసే అమిత్ బిగ్ బాస్ హౌస్‌లోకి రెండో కంటెస్టెంటుగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక మూడో కంటెస్టెంటుగా టీవీ 9 న్యూస్ రీడర్ దీప్తి నల్లమోతు ఎంటర్ అవ్వడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. బిగ్ బాస్ ఇంట్లోకి 4వ కంటెస్టెంటుగా హీరో తనీష్ అదేవిధంగా ఈషోలోకి సామాజిక వేత్త, హ్యూమన్ యాక్టివిస్ట్ బాబు గోగినేని ఎంట్రీ ఇవ్వడం అత్యంత షాకింగ్ గా మారింది. బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంటుగా తెలుగు నటి భానుశ్రీ హైదరాబాద్‌కు చెందిన ర్యాపర్ రోల్ రైడా కూడ ఎంటర్ అయ్యాడు. ఇక అనూహ్యంగా యాంకర్ శ్యామలను ఈషోలో చూసిన వారికి ఆశ్చర్యం కలిగింది. 
ఎనిమిదో కంటెస్ట్ గా యాంకర్ శ్యామల
అదేవిధంగా బిగ్ బాస్ హౌస్ లోకి కిరిటీ దామరాజు మరో సెలెబ్రెటీగా సోషల్ మీడియా సెన్సేషన్ బేబీ సునయన ప్రవేశించడం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు తెరపై తరచుగా కనిపించే నటుడు, ఫ్యాషన్ సెలబ్రిటీ కౌశల్ తో పాటు సినీ నటి తేజస్వి మదివాడ కూడ సెలబ్రిటీలుగా బిగ్ బాస్ లో హడావిడి చేయబోతున్నారు. వీరికితోడు యువ నటుడు, క్రికెటర్ సమ్రాట్ రెడ్డి కూడ బిగ్ బాస్ లో సందడి చేయబోతున్నాడు. అయితే అనూహ్యంగా ఈ బిగ్ బాస్ షోలోకి కామన్ మేన్ కేటగిరి నుంచి రేడియో జాకీ గణేష్ ఐశ్వర్యరాయ్ స్ఫూర్తిగా భావించే మోడల్ సంజనతో పాటు చివరి 16వ సెలబ్రిటీగా నూతన్ నాయుడు ప్రవేశించి అందరికీ షాక్ ఇచ్చాడు. సామాజిక కార్యకర్తగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేసిన ఈ కామన్ మేన్ సామాన్యుడు సత్తా చాటుతాను అని అంటున్నాడు. ఈషో  ప్రారంభోత్సవకార్యక్రమం జరుగుతున్నంత సేపు నాని ఈషోలో వ్యవహరిస్తున్న తీరును చాలామంది జూనియర్ తీరుతో పోల్చుకుంటున్న నేపధ్యంలో రానున్న రోజులలో ఈకార్యక్రమానికి సంబంధించి నానీకి విషమ పరీక్ష అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: