టాలీవుడ్ లో తన కామెడీ మార్క్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు హీరోగా తనదైన మార్క్ చాటుతున్నాడు. కుటుంబ కథా నేపథ్యంలో వస్తున్నా శ్రీనివాస్ రెడ్డి తాజాగా ‘జంబలకిడిపంబ’సినిమాలో నటిస్తున్నాడు. ఒకప్పుడు ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో సీనియర్ నరేష్ నటించిన జంబలకిడిపంబ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆడవారు మగవారిగా..మగవారు ఆడవారిగా మారితే ఎలా ఉంటుంతో అన్న కాన్సెప్ట్ తో దర్శకుడి వెరైటీ కామెడీతో తెలుగు ప్రేక్షకులకు మరుపురాని సినిమా అందించారు.
తాజాగా శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా నటిస్తున్న చిత్రం జంబలకిడిపంబ. జె.బి.మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రవి, జోజో జోస్, ఎస్.శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉన్న ఈ సినిమా గురించి హీరో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..జంబలకిడిపంబ టైటిల్ చిత్రానికి బాగా కుదిరింది. టైటిల్ను దృష్టిలో పెట్టుకుని సినిమాకు వచ్చే ప్రేక్షకుల్ని నిరాశపరచదు.
నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నాణ్యతతో సినిమా నిర్మించారు అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి కోసమే దర్శకుడు ఈ కథను రాసుకున్నారు. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే అంశాలన్నీ ఇందులో వుంటాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా ఈ నెల 22న విడుదల చేస్తున్నాం అన్నారు. యువత మెచ్చే అంశాలతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా అందరిని అకట్టుకుంటుంది అన్నారు.
సత్యం రాజేష్, ధన్రాజ్, షకలక శంకర్, హరితేజ, రాయలక్ష్మి, హిమజ, కేదారి శంకర్, మధుమణి, మిర్చి కిరణ్, జబర్దస్త్ అప్పారావు, సన, సంతోష్, గుండు సుదర్శన్, జబర్దస్త్ ఫణి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: గోపీసుందర్, కెమెరా:సతీష్ ముత్యాల, ఆర్ట్: రాజీవ్ నాయర్, రచన, దర్శకత్వం: జె.బి.మురళీకృష్ణ(మను).