భారతీయ చలన చిత్ర రంగంలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి.  అలనాటి మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించిన శ్రీదేవి తర్వాతి తరం చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో నటించి మెప్పించింది.  తెలుగు లో మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి అక్కడే స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు జాన్వి కపూర్, ఖుషీ కపూర్ లు జన్మించారు.  వివాహం తర్వాత సీనీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శ్రీదేవి ఇంగ్లీష్..వింగ్లీష్ తో రీ ఎంట్రీ ఇచ్చింది.
Dhadak
దుబాయ్ లో బంధువుల వివాహానికి వెళ్లి అక్కడే స్టార్ హోటల్లో అనుకోకుండా మృత్యువాత పడింది.  అయితే తన పెద్ద కూతురు జాన్వి కపూర్ ని హీరోయిన్ గా చూడాలని శ్రీదేవి ఎంతో ఆశపడింది..కానీ తన ఆశ నెరవేరకుండానే కన్నుమూసింది.  తాజాగా జాన్వి కపూర్ నటించిన ధడక్ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ .. ఇషాన్ జంటగా 'ధడక్' చిత్రం రూపొందింది. ధర్మ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించాడు.

టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఫస్టాఫ్ లో అందంగా సాగిపోయిన వాళ్ల ప్రేమకథ .. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనేది చూపించారు. ట్రైలర్ అంటే ఏదో నిమిషం, నిమిషంన్నర కాకుండా మూడు నిమిషాల లెంగ్తీ ట్రైలర్‌తో వచ్చారు. ఈ ట్రైలర్ లో జాన్వి కపూర్ మంచి అనుభవం ఉన్న నటిగా కనిపిస్తుంది. ఫేస్ ఎక్స్ ప్రేషన్స్..హావభావాలు చాలా అద్భుతంగా పండించిందని నెటిజన్లు అంటున్నారు.

కేవలం జాన్వీ అనే కాదు.. హీరో ఇషాన్ కూడా పాత్రకు తగ్గట్టుగా మెరిశాడు. సరదాగా సాగిపోయే సందడికి సంబంధించిన సన్నివేశాలపై .. సున్నితమైన భావోద్వేగాలపై ట్రైలర్ కట్ చేశారు. మొత్తం మీద యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమా, వాళ్లకి బాగా కనెక్ట్ అయ్యేలా వుంది. జాన్వీ కపూర్ ప్రతి ఫ్రేమ్ లోను చాలా అందంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి శశాంక్ కైతాన్ దర్శకత్వం వహించగా.. అజయ్ అతుల్ సంగీతం అందించారు. కరణ్ జోహార్, హైరో జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: