తెలుగు ఇండస్ట్రీలోకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి పదహారేళ్ల ప్రాయంలోనే హీరోయిన్ గా మహానటు సరసన నటించింది. అతిలోక సుందరిగా శ్రీదేవి బహుభాషా నటిగా గుర్తింపు పొందింది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ నెంబర్ వన్ హీరోయిన్ స్థాయికి చేరింది..స్టార్ ప్రొడ్యూసర్ అయిన బోనీకపూర్ ని వివాహం చేసుకుంది. అయితే బోనీకపూర్ కి అప్పటికే వివాహం అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో బోనీ కపూర్ పెద్ద భార్య తనయుడు అర్జున్ కపూర్ హీరోగా రాణిస్తున్నారు.
గతంలో అర్జున్ కపూర్, శ్రీదేవిల మద్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని వార్తలు వచ్చినప్పటికీ..శ్రీదేవి మరణం తర్వాత తన చెల్లెలు అయిన జాన్వి కపూర్, ఖుషీ కపూర్ ల బాధ్యత తండ్రి తర్వాత తానే చూసుకుంటున్నారు. ఈ క్రమంలో వారికి మద్దతుగా ఉంటూ వారిపై విమర్శలు చేసే వారిని తిప్పి కొడుతున్నాడు. అయితే తాజాగా ఓ విషయంలో జాన్వీకి సారీ చెప్పాడు అర్జున్. అసలు విషయానికి వస్తే..ఈ రోజు జాన్వీ నటించిన మొదటి చిత్రం ‘ధడక్’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
తాను షూటింగ్ బిజీలో ఉండటం వల్ల ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి హాజరు కాలేక పోతున్నానని..జాన్వీని ఉద్దేశించి ఓ పోస్ట్ చేశాడు అర్జున్. ‘‘ఈ రోజు నువ్వు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఈ రోజు నువ్వు నటించిన దఢక్ చిత్ర ట్రైలర్ విడుదల అవ్వబోతోంది. ఈ సమయంలో నేను ముంబైలో లేనందుకు సారీ. కానీ ఎప్పటికీ నీ పక్క నేనుంటా, బాధపడకు.
నువ్వు కష్టపడుతూ, నిజాయితీగా పనిచేస్తే ఈ పరిశ్రమ చాలా అద్భుతంగా ఉంటుంది. అందరి అభిప్రాయాల, సలహాలు తీసుకుంటూ నీకు నచ్చినట్లుగా ఒక మార్గాన్ని ఏర్పరుచుకో. ఈ పరిశ్రమలోని పిచ్చికి నువ్వు రెడీగా ఉన్నావని అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. నా స్నేహితులైన కరణ్ జోహార్, శశాంక్లు నిన్ను, ఇషాన్ను మోడ్రన్ రోమియో, జూలియట్గా చూపిస్తారని భావిస్తున్నా’’ ట్విట్ చేశాడు అర్జున్ కపూర్.