తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి తనపోరాటానికి మంచి స్పందన వచ్చిన సమయంలో పవన్ కళ్యాన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. అప్పటి వరకు సపోర్ట్ గా ఉన్నవారంతా ఒక్కసారే వేనక్కి తగ్గారు..అంతే కాదు శ్రీరెడ్డిని ఆకాశానికి ఎత్తిన మీడియా ఆమెను దూరంగా ఉంచడం మొదలు పెట్టింది. దాంతో శ్రీరెడ్డి ఇంట్లో ఉంటూనే సోషల్ మాద్యమాల ద్వారా పవన్, నాని లను టార్గెట్ చేస్తూ ట్విట్స్ చేస్తుంది.

Image result for శ్రీరెడ్డికి లీగల్‌ నోటీసులు

గత కొంత కాలంగా నానిపై చేస్తున్న వివాదాస్ప వ్యాఖ్యలకు నాని స్పందించారు. శ్రీరెడ్డి ఆరోపణలపై నాని పరోక్షంగా స్పందించారు. నేరుగా మీడియా ముందుకు రాకుండా ట్విట్టర్ ద్వారా శ్రీరెడ్డిని హెచ్చరించారు. శ్రీరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తున్నానని, లీగల్ నోటీసులు కూడా పంపానని నాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

nani reacts to allegations by sri reddy, says will proceed legally

‘నేను స్పందించి ఆ బురదను నాకు అంటించుకోవడంలేదు. వాళ్లు ఏం కోరుకుంటున్నారో అది నేను ఇవ్వడంలేదు. లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాను. పరునష్టం దావా వేయడానికి లీగల్ నోటీసులు పంపించాను. ఒకరు కొంత మందిని టార్గెట్ చేస్తూ వాళ్ల పేర్లను ఎంచుకొని నిరాధారమైన పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు.


నేను నా గురించి కలతచెందలేదు. మనం నివసిస్తోన్న ఈ సమాజం గురించి కంగారుపడుతున్నాను. క్లిక్కులు, వ్యూస్ కోసం దీన్ని కొంతమంది పబ్లిష్ చేయడం సిగ్గుచేటు. మీ అందరికీ కుటుంబాలు ఉన్నాయి’ అని నాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, నాని ట్విట్స్ కి శ్రీరెడ్డి కూడా ఘాటుగా స్పందించింది.  ‘కచ్చితంగా లీగల్‌గా ఫైట్ చేద్దాం’ అంటూ స్పందించింది.  సోమవారం ఉదయం కూడా నానిపై పచ్చిగా ఆరోపణలు చేస్తూ శ్రీరెడ్డి ట్వీట్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: