తెలుగు ఇండస్ట్రీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి తర్వాత అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది.  తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న సమయంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  అక్కడే బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బోని కపూర్ ని వివాహం చేసుకుంది.  వీరిద్దిరి ఇద్దరు ఆడపిల్లలు జాన్వి కపూర్, ఖుషి కపూర్. 


జాన్వి కపూర్ ‘ధడక్’ చిత్రంలో నటిస్తున్న సమయంలో దుబాయ్ లో ఓ వివాహ వేడుకకు వెళ్లిన శ్రీదేవి అనుకోకుండ మరణించారు. ఆమె మరణంతో యావత్ భారత దేశంలో కోట్లాది మంది అభిమానులే కాదు..ఇండస్ట్రీ వర్గానికి చెందిన వారు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు.  తన పెద్ద కూతురు జాన్విని హీరోయిన్ గా చూడాలన్న శ్రీదేవి ఎంతో ఆశపడింది..కానీ అంతలోనే మృత్యువాత పడింది. ఈ రోజూ జాన్వి నటించిన ‘ధడక్’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 

ఈ ట్రైలర్ లో  జాన్వీ అద్భుతమైన నటన ప్రదర్శించింది. ఈ ట్రైలర్‌ లాంఛ్‌ కార్యక్రమానికి అనిల్‌ కపూర్‌, బోని కపూర్‌లతో పాటు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా హాజరైంది. ఈ కార్యక్రమంలో శ్రీదేవిని తలుచుకుని కపూర్‌ కుటుంబ సభ్యులంతా భావోద్వేగానికి గురయ్యారు.ఖుషీ కపూర్ తన తల్లిని తలుచుకుని కన్నీరు పెట్టుకుంది. దీంతో తన చెల్లిని జాన్వీ కపూర్‌ ఓదార్చింది. దీంతో అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: