తెలుగు బుల్లితెరపై పాపులర్ ప్రొగ్రామ్ ‘జబర్దస్త్’కామెడీ షో పై రోజు రోజుకీ ప్రేక్షకుల్లో క్రేజ్ పెరిగిపోతూనే ఉంది.  జబర్దస్త్ కార్యక్రమం వస్తుందంటే చాలు ఇంట్లో ఉన్న మహిళలు ఎగిరి గంతేసి టివీలకు అతుక్కుపోతారు. ఈ కార్యక్రమం వచ్చే టైంలో ఇక ఎలాంటి పని పెట్టుకోరు కూడా. అయితే ఈమధ్య జబర్దస్త్‌లో కామెడీ స్కిట్ల కన్నా వల్గర్ డైలాగ్‌లే ఎక్కువగా ఉంటున్నాయంటూ మహిళా సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి.  ఇప్పటికే పలు మార్లు స్కిట్లపై విమర్శలు రావడమే కాదు..గతంలో వేణు పై దాడి కూడా చేశారు. కొంతమంది అయితే ఏకంగా పోలీసులకు కూడా ఫిర్యాదులు చేశారు. 

మరోవైపు జబర్ధస్త్ పై అభిమానం పెరుగుతూనే ఉంది. జబర్ధస్త్ అంటే ఇప్పుడు హైపర్ ఆది వేసే పంచ్ లు బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అనసూయతో హైపర్ ఆది హగ్ చేసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. స్వర్గాన్ని చూడాలంటే ఏం చెయ్యాలి అంటూ హైపర్ ఆది ఒక ఎపిసోడ్‌లో పంచ్ వేస్తాడు. టీంలోని వారు సమాధానం చెప్పకపోవడంతో అనసూయను హగ్ చేసుకుంటే చాలురా స్వర్గం దానికదే కనిపిస్తుందని అంటాడు.ఒక్క అవకాశం ప్లీజ్ అంటూ అనసూయను కోరతాడు హైపర్ ఆది.

దీంతో అనసూయ కూడా ఏమాత్రం ఆలోచించకుండా తను కూర్చున్న ప్లేస్ నుంచి లేచి నిలబడుతుంది. దీంతో హైపర్ ఆది పరుగుత్తుకెళ్ళి అనసూయను హగ్ చేసుకుంటాడు. కొద్దిసేపు పాటు అలాగే పట్టుకుంటాడు. ఈ స్కిట్ అయిపోయిన తర్వాత అనసూయ హైపర్ ఆదికి సీరియస్ గా క్లాస్ పీకినట్లు సమాచారం.  హైపర్ ఆది ఎంత ప్రాధేయపడినా ఆమె మాత్రం తగ్గలేదట. దీంతో హైపర్ ఆది జబర్దస్త్ షో నిర్వహిస్తున్న శ్యాంప్రసాద్ రెడ్డి ద్వారా అనసూయకు సారీ చెప్పించే ప్రయత్నం చేస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: