నిన్న రాత్రి ప్రసారం అయిన ‘బిగ్ బాస్ 2’ షో లో బుల్లితెర ప్రేక్షకులు ఊహించని అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండురోజుల పాటు జైల్లో గడిపిన సంజనకు ‘బిగ్ బాస్’ విముక్తి కలిపించిన తరువాత సంజన ఇంట్లోకి రాగానే ‘బిగ్ బాస్’ హౌస్ లో ఉన్న 16 మంది సభ్యులను యజమానులు సేవకులు అనే రెండు విభాగాలుగా విభజించాడు ‘బిగ్ బాస్’. 
దారుణమైన నిబంధనలు
ఇలా రెండు విభాగాలుగా విభజించిన ‘బిగ్ బాస్’ ఆతరువాత కిరీటీ రామరాజుకు తొలి టాస్క్ అప్పగించాడు. ఈ టాస్క్ కు ‘చెప్పండి ప్రభు' అనే పేరు పెట్టారు. సేవకుల టీమ్ లో ఉన్నవారంతా యజమానులు చెప్పినట్లు వినాలని వారు ఏపని చెప్పినా చేయాలని ‘బిగ్ బాస్’ సూచించాడు. అంతేకాకుండా అనేక దారుణ నిబంధనలు పెడుతూ సేవకులు అరిటాకుల్లో మాత్రమే తినాలని మళ్లీ తినాలనిపిస్తే అదే ఆకును శుభ్రం చేసుకోవాలని ‘బిగ్ బాస్’ సూచించాడు. 
తొలి లగ్జరీ బడ్జెట్ టాస్క్
అంతేకాదు సేవకులు యజమానులతో కలిసి బెడ్రూమ్ లో పడుకోకూడదని కఠినమైన నిబంధనలు పెట్టారు. ఈ నేపధ్యంలో యజమాని హోదాలో ఉన్న సామ్రాట్ అమిత్‌ తో హెడ్ మసాజ్ చేయించుకోగా కౌశల్ భానుశ్రీతో బాడీ మసాజ్ చేయించుకున్నాడు. జైలు నుండి విడుదలై కసిగా ఉన్న సంజన సేవకుల టీం పై తన కసిని పూర్తిగా చూపించింది. 
సంజన టీంకు యజమానుల హోదా
ముఖ్యంగా సేవకుల టీమ్ లో ఉన్న బాబు గోగినేనిని పిలిచి తనకు హెడ్ మసాజ్ చేయాల్సిందిగా సంజన ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ పనిని చేయడానికి బాబు గోగినేని తప్పించుకునే ప్రయత్నం చేయడమే కాకుండా సంజనతో వాదనకు దిగాడు. అయితే సంజన బాబు గోగినేని పట్ల తీవ్ర తిరస్కార స్వరంతో మాట్లాడటంతో పనివారికి కూడ హక్కులు ఉంటాయి అంటూ బాబు గోగినేని తిరుగుబాటు చేసాడు.  దీనికితోడు సంజన సేవకులను ఇబ్బంది పెడుతోంది అంటూ సేవకుల టీమ్ లో ఉన్న చాలామంది తిరుగుబాటు చేసారు. ఎంతో మేధావిగా హేతువాదిగా పేరు గాంచిన బాబు గోగినేని సేవకుడుగా మారి చేసిన తిరిగుబాటు నిన్నటి ‘బిగ్ బాస్’ షోకు హైలెట్..



మరింత సమాచారం తెలుసుకోండి: