మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన పరాజయాల నుండి దాటుకోవడానికి ఒక మెగా సెంటిమెంట్ ను నమ్ముకుని తన లేటెస్ట్ మూవీ ‘తేజ్ ఐ లవ్యూ’ ను విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీని విడుదల చేయడానికి నిర్మాతలు జూన్ 29 రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినా ఆ రిలీజ్ డేట్ తనకు సెంటిమెంట్ గా నచ్చలేదు అని తేజ్ తన నిర్మాతలకు సూచించినట్లు టాక్.
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం సాయి ధరమ్ తేజ్ తన లేటెస్ట్ మూవీ రిలీజ్ కు జూలై 6న ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికికారణం జూలై నెలతో మెగా హీరోలకు ఉన్న సెంటిమెంట్ అని అంటున్నారు. జూలై నెలలో మెగా హీరోలు నటించిన ‘ఇంద్ర’ ‘తమ్ముడు’ ‘తొలిప్రేమ’ ‘మగధీర’ ‘ఫిదా’ ఇలా మెగా హీరోల సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపధ్యంలో ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ తనకు కూడ కావాలి అని సాయి ధరమ్ తేజ్ ఆలోచనలు అని అంటున్నారు.
అంతేకాకుండా జూన్ నెలాఖరు సినిమాల విడుదలకు సంబంధించి మంచి సీజన్ కాదని సాయి ధరమ్ తేజ్ వాదన అని అంటున్నారు. జూన్ నెలలో మధ్యతరగతి కుటుంబాలు అన్నీ స్కూళ్ళ ఫీజులు బుక్స్ గురించి ఆలోచిస్తారు కాబట్టి ధియేటర్స్ కు పెద్దగా రారు అని తేజ్ ఆలోచన అని తెలుస్తోంది. అందువల్ల జూలై మొదటి వారం అయితే కలక్షన్స్ విషయంలో అన్ని విధాల బాగుంటుంది అని ఈ మెగా మేనల్లుడి ఆలోచన.
అయితే ఇన్ని సెంటిమెంట్స్ తో ఆలోచించినా సినిమా బాగుండకపోతే పెద్ద పండుగ సంక్రాంతికి విడుదలైన సినిమాలను కూడ రిజిక్ట్ చేస్తున్న పరిస్థుతులు. ఇలాంటి సందర్భంలో కేవలం ఒక సెంటిమెంట్ ను నమ్ముకుని సాయి ధరమ్ తేజ్ చేస్తున్న ప్రయోగం ఎంత వరకు హిట్ ను ఇస్తుందో చూడాలి..