బిగ్ బాస్ 2 సీజన్ ఆదివారం నుంచి మొదలైంది. గతంలో బిగ్ బాస్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించేవారు..కానీ షూటింగ్స్ బిజీ ఉండటంతో ఆ స్థానంలో నేచురల్ స్టార్ నానీ వ్యాఖ్యాతగా వచ్చారు. ఆదివారం ఎంతో ఆర్భాటంగా మొదలైన బిగ్ బాస్ 2 లైవ్ షో లో 16 మంది కంటెస్టంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో 13 మంది సెలబ్రెటీలు కాగా ముగ్గురు మాత్రం కామన్ పీపుల్స్. అయితే ఇందులో ఇద్దరు విజయవాడకు చెందిన వారైతే ఒకరు విశాఖకు చెందిన వారు. బిగ్బాస్ సీజన్ 2 వరుసగా మూడో రోజు అదే జోష్తో ప్రారంభమైంది.
ఇక తొలి ఎపిసోడ్లో ఊహించని పరిణామంతో బిగ్బాస్ హౌస్ జైలు పాలైన ఇద్దరు సామాన్యుల్లో నూతన్ నాయుడు బయటకు వచ్చేయగా.. మోడల్ సంజనా అన్నే మాత్రం ఇంకా జైలులోనే మగ్గుతోంది. బిగ్ బాస్ 2 లో ఇప్పుడిప్పుడే అసలు సిసలు మసాలా దట్టించేందుకు చిన్న చిన్న గొడవలు, కోపతాపాలు, బుజ్జగింపులు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే..బిగ్ బాస్లో అత్యంత కీలకమైన తొలి ఎలిమినేషన్కి డేంజర్ బెల్స్ మోగించారు బిగ్ బాస్.
ఈ తొలి ఎలిమినేషన్లో మొత్తం ఆరుగురు నామినేట్ అయ్యారు. వారిలో గణేష్, కౌశిక్, సంజనా, దీప్తి సునైనా, కిరీటి, నూతన్ నాయుడులు ఎలిమినేషన్ జోన్లో ఉండగా.. ఓటింగ్ ప్రకారం ఈ ఆరుగురిలో ఇద్దర్ని ఎలిమినేట్ చేస్తారా? లేక ఒకర్ని ఎలిమినేట్ చేస్తారా అన్నదే నేటి ఎపిసోడ్ హైలైట్. కాగా, బిగ్ బాస్ జైలులో ఉన్న సంజనా తన అసహనాన్ని మరోసారి వ్యక్తం చేసింది.
బిగ్ బాస్కి వచ్చినప్పుడే అనుకున్నా.. నేను వన్ సైడ్ వార్ చేయాల్సి వస్తుందని ముందే అనుకున్నా.. నన్ను ఎలిమినేట్ చేయడం ద్వారా తొలిరోజే అదే నిజం అని అర్ధమైందంటూ బిగ్ బాస్ బనానా దీప్తి సునైనా, రోల్ రైడాతో వద్ద తన బాధను వ్యక్త పరిచింది సంజనా. ఇంతలోనే బిగ్బాస్ జైలు నుండి సంజనాను విడుదల చేస్తూ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రావడంతో సంజనా ఆనందానికి అవధులు లేవు.
అంతే కాదు సంజనాకు మరో అద్భుత అవకాశం ఇచ్చింది. నతో పాటు మరో ఏడు మందితో బిగ్ బాస్ హౌస్లో టీంను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు బిగ్ బాస్. దీంతో సంజనా 15 మందిలో తనీష్, తేజస్వినీ, కౌశిక్, గీతా మధురి, సామ్రాట్, సునైనా, గణేష్లతో తన టీంని ఏర్పాటు చేసుకుంది.