టాలీవుడ్ లో క్రేజీ మల్టీస్టారర్ గా తెరకెక్కే రాజమౌళి సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే ఈ సినిమాపై రకరకాల రూమర్స్ వస్తున్నాయి. సినిమా ఎనౌన్స్ చేసిన నాటి నుండి రోజుకో స్టోరీ బయటకు వస్తుండగా వాటిలో ఏది వాస్తవం కాదని తెలుస్తుంది. ఇక ఈ సినిమా విషయంలో ఎన్.టి.ఆర్ చొరవ ఎక్కువగా ఉందని లేటెస్ట్ టాక్.


బాహుబలి తర్వాత రాజమౌళి ఎన్.టి.ఆర్ తో సినిమా చేయాలని అనుకున్నాడట. కాని తన దగ్గరకు వచ్చిన ఓ మల్టీస్టారర్ కథను తారక్ తో డిస్కస్ చేశాడట. అయితే ఎన్.టి.ఆర్ ఆ స్క్రిప్ట్ మీద మనసు పడటంతో మరో హీరో కోసం వెతికారట. ఇక ఎన్.టి.ఆర్ సలహా మేరకే రాజమౌళి రాం చరణ్ ను ఈ ప్రాజెక్టుకి సెలెక్ట్ చేశారని అంటున్నారు.


రాజమౌళి, ఎన్.టి.ఆర్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. బయటకు స్టోరీ తెలియదని చెబుతున్నా ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరికి ట్రిపుల్ ఆర్ స్టోరీ లైన్ చెప్పాడట జక్కన్న. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, రష్మిక మందన్న హీరోయిన్స్ గా సెలెక్ట్ అయ్యారట.


ఎన్.టి.ఆర్ గ్యాంగ్ స్టర్ గా.. రాం చరణ్ పోలీస్ గా కనిపించబోతున్నారని తెలుస్తుంది. బాహుబలి రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా తెరకెక్కించే ఆలోచన లో ఉన్నాడట రాజమౌళి. మరి ఈ క్రేజీ మల్టీస్టారర్ బాహుబలి రికార్డులను బీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: