ఒకప్పుడు మాస్ సినిమాలకు చిరునామాగా టాప్ డైరెక్టర్స్ లిస్టులో కొనసాగిన వివి వినాయక్ క్రేజ్ ఇప్పుడు లేదు. చిరంజీవి రీ ఎంట్రిఫిలిం ‘ఖైదీ నెంబర్ 150’ దర్శకత్వం వహించి ఆమూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేసినా టాప్ హీరోలు ఎవరు ఈ దర్శకుడు పై ఆసక్తి కనపరచడం లేదు. దీనితో ఈమధ్య సాయిధరమ్ తేజ్ తో వినాయక్ చేసిన ‘ఇంటలిజెంట్’ మూవీ ప్రయోగం ఘోరమైన ఫెయిల్యూర్ గా మారడంతో వినాయక్ గ్రాఫ్ మరింత తగ్గింది.
అయితే వినాయక్ ప్రస్తుత పరిస్థితిని పట్టించుకోకుండా బాలకృష్ణ ఈదర్శకుడుతో మరో సినిమాకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పరుచూరి బ్రదర్స స్క్రిప్ట్ అందిస్తున్న ఈమూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఆశ్చర్యకరంగా ఈమూవీకి ‘ఏకే 47’ అన్న టైటిల్ ను పెడుతున్నట్లు సమాచారం.
చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ అంటూ అంకెల మ్యాజిక్ చేసిన వినాయక్ తిరిగి అదే అంకెల సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ బాలయ్య మూవీకి ఇలా ‘ఏకే 47’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసాడు అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ పూర్తి అయిన తరువాత ఈమూవీ షూటింగ్ ఈసంవత్సరాంతంలో ప్రారంభం అవుతుంది అని అంటున్నారు.
గతంలో ‘చెన్నకేశవరెడ్డి’ లాంటి భారీ సినిమాను వినాయక్ బాలకృష్ణతో తీసినా ఆసినిమా ఫెయిల్ అయినా పట్టించుకోకుండా తిరిగి బాలయ్య వినాయక్ కు అవకాశం ఇవ్వడం ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అయితే 9 సంవత్సరాల తరువాత చిరంజీవిని ‘ఖైదీ నెంబర్ 150’ గా చూపించి రికార్డులు క్రియేట్ చేసిన నేపధ్యంలో అలాంటి రికార్డులను తనకు కూడ ఇస్తాడు అన్న నమ్మకంతో బాలకృష్ణ వినాయక్ కు ఈ అవకాశం ఇచ్చి ఉంటాడు అన్న ప్రచారం జరుగుతోంది..