ఇప్పుడు తెలుగు వాళ్లు తమ పొరుగింటి మీద కన్నేయడం మానేసి బిగ్ బాస్ ఇంటిపై ఒక కన్నేసి ఉంచుతున్నారు. జూన్ పదవ తేదీన అట్టహాసంగా ప్రారంభమయిన బిగ్ బాస్ సీజన్ 2 ప్రస్తుతానికి యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. మొదటి సీజన్ తో పోలిస్తే ఈ రెండవ సీజన్లో తెలిసిన మొఖాలు పెద్దగా లేకపోవడం, ఎంటర్ టైన్ చేసే పర్సనాలిటీలు లేకపోవడం ఈ సీజన్ పై ప్రేక్షకుల అనాసక్తి కనపడుతుంది.


ఈ షో విజయవంతంగా నడుస్తున్నదా లేదా అనే వివరాలు పక్కనపెడితే, ఈ షోలో నాని నుండి కంటెస్టెంట్ల వరకు పాలుపంచుకుంటున్న వ్యక్తుల రెమ్యూనరేషన్లకు సంబంధించిన ఒక జాబితా ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తుంది. ఆ జాబితాను బట్టి చూస్తే సెలెబ్రిటీల నుండి సామాన్యుడి వరకు వారి స్థాయికి మించి డబ్బులు ముట్టినట్లు తెలుస్తోంది. శని, ఆది వారాలు మాత్రమే దర్శనమిచ్చే నాని సుమారుగా రూ. 3.5 కోట్ల మేర రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. కంటెస్టెంట్లలో సింగర్ గీతా మాధురికి అత్యధికంగా రూ. 20 లక్షలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. 


గీతా మాధురి తరువాత జనాలలో కొంత ఫేమ్ కలిగిన హేతువాది, మానవవాది అయిన బాబు గోగినేని, హీరో తనీష్, విలన్ పాత్రధారి అమిత్ కుమార్ మరియు నటి తేజస్విలకు రూ.8 లక్షలు మేర అప్పజెప్పారట. తరువాతి కేటగిరీ లో నటులు సామ్రాట్, కిరిటీ , కౌశల్, భాను శ్రీ , యాంకర్ శ్యామల, డబ్ స్మాష్ ఫేమ్ దీప్తి సునైనా, రాపర్ రోల్ రైడా, న్యూస్ యాంకర్ దీప్తి లకు రూ. 5  లక్షలు ఇచ్చారట. ఇంక చివరగా కామన్ మ్యాన్ కేటగిరీలోని గణేష్, నూతన నాయుడు మరియు మోడల్ సంజనలకు రూ. 3 లక్షల దాకా ముట్టజెప్పినట్లు సమాచారం. మొత్తానికి ఈ రెమ్యూనరేషన్ ఎంటర్టైన్మెంట్ చేసే సామర్థ్యాన్ని బట్టి నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఈ రెమ్యూనరేషన్ జాబితాపట్ల బిగ్ బాస్ టీం ఎటువంటి అధికారిక ప్రకటనను విడుదలచేయలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: